ప్రగతిభవన్లో జగన్కు కేసీఆర్ పంచభక్ష్య పరమాన్నాలు పెట్టి జీవో 203 రాసిచ్చారన్నారు రేవంత్ రెడ్డి. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ప్రగతి భవన్లో కేసీఆర్ డైనింగ్ టేబుల్పైనే పునాదిరాయి పడిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఏపీ పోలీసులు ఏకే–47 తుపాకులతో వచ్చి పూర్తిగా తెలంగాణ భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ను ఆక్రమించుకుంటే చేతగాని సన్నాసుల్లా ఇక్కడి ప్రభుత్వం చూస్తుండిపోయిందన్నారు.
ఇంటిదొంగల సహకారం లేకుంటే వాళ్లు వచ్చేవారా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ రాయలసీమకు వెళ్లి.. మంత్రి రోజా పెట్టిన రాగిసంగటి, రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాలసీమను చేస్తా అని వచ్చిండు అంటూ రేవంత్ చురకలంటించారు.