ప్రజలు తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సెలబ్రెటీలు కూడా ఆయా పోలింగ్ సెంటర్లలో ఓటు వేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట పెద్దఎత్తున వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆయా సెంటర్లలో మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, నమ్రతా, రామ్ చరణ్, అల్లు అర్జున్, రవితేజ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, రానా దగ్గుబాటి, నాని తమ ఓటు హక్కును జుబ్లీహిల్స్, చుట్టు పక్కా ప్రాంతాల్లోని సెంటర్లలో వినియోగించుకున్నారు.
అయితే ఉదయం నుంచి కూడా ప్రతి సెలబ్రిటీ .. తమ ఓటును వినియోగించుకొని.. దాని విలువ గురించి చెప్పుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి దగ్గరనుంచి కుర్ర హీరో నిఖిల్ వరకు అందరూ తమ ఓటుహక్కును వినియోగించుకున్న్నారు. కానీ, ప్రభాస్ మాత్రం.. ఓటు వేయడానికి కూడా రాలేదు. అయితే ప్రభాద్ ఎక్కడ ఉన్నాడు అనేది కూడా సమాచారం లేదు.

సలార్ షూటింగ్ లో ఉన్నాడా.. ? లేక రెస్ట్ మోడ్ లో ఉన్నాడా.. ? అనేది తెలియాల్సి ఉంది. ఈ ఓటు కోసం ఎంతో మంది సెలబ్రిటీలు షూటింగ్ మానుకొని మరీ వచ్చారు. మరి ప్రభాస్ ఎందుకు రాలేదని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇక పోలింగ్ బూత్ ల వద్ద ప్రభాస్ ఫ్యాన్స్.. డార్లింగ్ వస్తాడని ఎంతగానో ఎదురుచూసారు.. కానీ, డార్లింగ్ రాకపోయేసరికి వాళ్లు నిరాశపడుతున్నారు.