ధనుష్ పెద్ద కుమారుడు యాత్ర తాజా వీడియోలో సూపర్బైక్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇది సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది. వీడియోలో యాత్ర పోయెస్ గార్డెన్ ప్రాంతంలో సూపర్ బైక్ నడుపుతూ కనిపించాడు. సహాయకుడు అతనికి ద్విచక్ర వాహన డ్రైవింగ్ ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు. అయితే ధనుష్ కొడుక్కి డ్రైవింగ్ లైసెన్స్ లేదని, అతడికి ఇంకా పద్దెనిమిదేళ్లు నిండని కారణంగా తాజా వీడియో వివాదానికి దారితీసింది. అయితే ప్రముఖ నటుడు ధనుష్-రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దంపతులు తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి గత ఏడాది స్వస్థి పలికిన సంగతి విదితమే.
ఈ విషయం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. వీరికి ఇద్దరు కుమారులు యాత్ర, లింగ. ప్రస్తుతం ధనుష్-ఐశ్వర్యలు తమ కెరీర్ పై దృష్టి సారిస్తున్నారు. ధనుష్ పోయిస్ గార్డెన్లో కొత్త ఇల్లు కట్టుకుని స్థిరపడ్డారు. ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య పోయెస్ గార్డెన్లోనే పిల్లలతో కలిసి ఉంటుంది. పిల్లలిద్దరూ తల్లిదండ్రులిద్దరి ఇళ్లకు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ఈ క్రమంలో పెద్ద కుమారుడు యాత్ర.. ఆర్ 15 బైక్ నడుపుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇదే పెను దుమారానికి కారణమైంది. ఎందుకంటే అతడికి ఇంకా 18 ఏళ్లు నిండలేదు.
అంతేకాకుండా పోయిస్ గార్డెన్ వంటి ఏరియాలో హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్సు లేకుండా, కేవలం మాస్క్ ధరించి డ్రైవింగ్ చేయడంతో ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అయితే అతడు వీడియో తీస్తున్న సమయంలో యాత్ర సహాయకుడు వీడియో తీయొద్దు అంటూ అడ్డుపడ్డాడు. ఈ వీడియో ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వెళడంతో.. నంబర్ ప్లేట్ ఆధారంగా ధనుష్, ఐశ్వర్యల కుమారుడని నిర్దారించుకుని.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు అతడికి వెయ్యి రూపాయాలు జరిమానా విధించారు. ఇటీవల యాత్ర దీపావళిని తల్లి ఐశ్వర్య, తాత రజనీకాంత్తో జరుపుకున్న ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేసిన సంగతి విదితమే.