కిర్రాక్ RPకి ఘోర అవమానం, చంద్రబాబు చూస్తుండగానే ఏం చేసాడో చుడండి.

చంద్రబాబు.. వైసీపీ నేతలు జగన్ తీరును భరించలేక టీడీపీలోకి వస్తున్నారని, ఇది ప్రారంభం మాత్రమేనని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక తిరుగుబాటు ఉద్ధృతం అవుతుందని అన్నారు. వైసీపీ నాయకుడు అనే వాడు రోడ్డు మీద తిరగాలంటేనే భయపడే రోజు త్వరలోనే వస్తుందని హెచ్చరించారు. ఇక్కడ నెల్లూరు నడి వీధిలో ఒక నాయకుడు మొన్నటి వరకు ఎగిరెగిరి పడ్డాడు.

ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒంటి మీద బట్టలు కూడా నిలవలేదు… కన్నుమిన్ను కానలేదు… మన ఖర్మ కొద్దీ ఆయన కూడా మంత్రి అయ్యాడు. కానీ, మొన్న బదిలీల్లో ఒక్క తన్ను తంతే… ఒక్క జిల్లా కాదు మూడు జిల్లాల అవతలికి పోయి పడ్డాడు.

బుల్లెట్ దిగిందా, లేదా అని ఒకప్పుడు డైలాగులు కొడుతుండేవాడు. ఇప్పుడు బుల్లెట్ కరెక్టుగా దిగింది. రేపు పల్నాడులో కూడా కరెక్టుగా బుల్లెట్ దిగుతుంది. ఈసారి తిరుగుటపాలో చెన్నైకి పోతాడు. ఇవాళ ఉంటుంది, రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది… వైసీపీ నాయకులు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *