స్కిన్ ఎలర్జీ ఉందని చంద్రబాబు చెప్పడంతో రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి నుండి వైద్య నిపుణులను తీసుకుని వచ్చామని, వైద్య నిపుణులు పరీక్షలు చేసిన అనంతరం వారి సూచనల మేరకు చంద్రబాబుకి వైద్య సాయం అందిస్తున్నామని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జైలు అధికారులు తెలిపారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు ఉన్న బ్యారక్ లో టవర్ ఏసీ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. చంద్రబాబు 67 కేజీల బరువు ఉన్నారని పేర్కొన్నారు. స్కిల్ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించగా, ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే, ఇటీవల వేడి వాతావరణంతో ఆయన ఆరోగ్య పరిస్థితిలో మార్పులు వచ్చాయి.
జైలు వైద్యాధికారితో పాటు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వైద్యులు కూడా చంద్రబాబును పరిశీలించారు. చంద్రబాబు ఆరోగ్యంపై నివేదికను కోర్టుకు సమర్పించారు. చంద్రబాబుకు చల్లని వాతావరణం అవసరమని వైద్యులు సిఫారసు చేయగా, ఏసీబీ కోర్టు చంద్రబాబుకు ఏసీ సౌకర్యం అమర్చాలని ఆదేశాలు జారీ చేసింది.