అయోధ్య రామయ్యకు భారీ విరాళం ప్రకటించిన ముఖేశ్ అంబానీ. ఏంటంటే..?

భారతీయుల కల సాకారమవుతున్న వేళ.. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కోసం రాముడి ఆలయాన్ని అత్యంత వైభవంగా ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు, దిగ్గజ వ్యాపారవేత్తలు హాజరయ్యారు. అయితే అయోధ్య రామజన్మభూమి ట్రస్ట్‌కు విరాళాల పర్వం కొనసాగుతోంది. సోమవారం బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న భారత అపరకుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కుటుంబం రూ.2.51 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది.

రామజన్మభూమి ట్రస్ట్‌కు ఈ పెద్ద మొత్తాన్ని ఇస్తున్నట్టు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ముఖేష్ అంబానీ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు రూ. 2.51 కోట్లు విరాళంగా అందించారు. సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగివున్న అయోధ్య రామ మందిర అభివృద్ధికి పవిత్ర ప్రయత్నం” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా సోమవారం జరిగిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ముఖేష్ అంబానీ, భార్య నీతా, కుమారులు ఆకాశ్, అనంత్, కోడలు శ్లోకా మెహతాతో పాటు కాబోయే కోడలు రాధిక మర్చంట్, కుమార్తె ఇషా, అల్లుడు ఆనంద్ పిరమాల్ పాల్గొన్నారు.

అయోధ్య రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించిన ప్రముఖ వ్యక్తుల్లో వీరు కూడా ఉన్నారు. రోజు రాముడు విచ్చేస్తున్నాడని దేశం మొత్తం ‘రామ్ దీపావళి’ని జరుపుకుంటోందని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ముఖేశ్ అంబానీ అన్నారు. జనవరి 22న దేశం మొత్తానికి రామ్ దీపావళి వ్యాఖ్యానించారు. ఇక ఇది చారిత్రాత్మకమైన రోజు అని నీతా అంబానీ అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *