అమ్మకు రెండో పెళ్లి చేస్తా, కుర్రాళ్ళు సరిపోరు, అంకుల్స్ కావాలి: సుప్రీత

సుప్రీత కి హీరోయిన్స్ సోషల్ మీడియా ప్రపంచంలో ఏ రేంజ్ లో గ్లామర్ షోతో ఆకట్టుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న హీరోయిన్స్ నుంచి సీనియర్ స్టార్స్ వరకు అందరికి ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు సోషల్ స్టేటస్ గా మారిపోయింది. ఇక అందులో రెగ్యులర్ గా తన గ్లామర్ ఫోటోలని అప్లోడ్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు. అయితే సురేఖావాణి భర్త మరణించి దాదాపు ఐదేళ్లు అవుతుంది. 2019లో ఆయన కన్నుమూశారు. అప్పటి నుండి కూతురితో పాటు సురేఖావాణి ఒంటరిగా ఉంటుంది.

ఈ క్రమంలో పలుమార్లు సురేఖావాణి పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. మొదట్లో ఈ వార్తలను సురేఖావాణి కూతురు సుప్రీత ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్లు వ్యక్తిగత విషయాలు రాయకండని ఆమె మండిపడింది. అయితే సురేఖావాణి అప్పుడప్పుడు మనసులోని రెండో పెళ్లి ఆలోచన బయటపెట్టింది. నచ్చినవాడు దొరికితే పెళ్లి చేసుకోకపోయినా, డేటింగ్ కి సిద్ధం అని ఓపెన్ అయ్యింది.

మంచి హైట్, ఫిజిక్, నిండు గడ్డం కలిగినవాడు కావాలని నిస్సంకోచంగా చెప్పింది. తాజాగా సురేఖావాణి కూతురు సుప్రీత తల్లి పెళ్లి గురించి కొన్ని క్రేజీ కామెంట్స్ చేసింది. సురేఖావాణికి మరో పెళ్లి చేసే ఆలోచన ఉన్నట్లు వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుప్రీతను సురేఖావాణికి రెండో వివాహం చేసే ఆలోచన ఉందా… అని అడగడం జరిగింది. దీనికి సమాధానంగా… అవును అమ్మకు రెండో పెళ్లి చేయాలి. నాకు ఆ ఆలోచన ఉంది.

అయితే అమ్మకు అబ్బాయిలు సెట్ కారు. అంకుల్స్ అయితే సెట్ అవుతారు. ఒక మంచి అంకుల్ ని వెతికే పనిలో ఉన్నాను. అమ్మను బాగా చూసుకోవాలి. అలాగే చెడు ఆలోచనలు లేనివాడై ఉండాలి. ఈ లక్షణాలున్న అంకుల్ దొరికితే పెళ్లి చేసేస్తా… అని సుప్రీత అన్నారు. గతంలో రెండో పెళ్లి అంటే మండిపడిన ఆమె ఇప్పుడేమో తానే స్వయంగా తల్లికి భర్తను వెతుకున్నట్లు చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *