ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మంత్రి రోజాను తప్పించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నగరి నియోజకవర్గం నుండి టికెట్ ఆశిస్తున్న రోజాకు ఈసారి ఎట్టి పరిస్థితులలోనూ టికెట్టు దొరకదని తాజా పరిస్థితులను బట్టి అర్థమవుతుంది. అయితే పుత్తూరు మునిసిపల్ కార్పొరేషన్లో 17 వార్డ్ కౌన్సిలర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు భువనేశ్వరి. ఎస్సీ అయినా జనరల్ వార్డులో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మునిసిపల్ చైర్మన్ పదవి ఎస్సీ రిజర్డ్వ్ కావడంతో భువనేశ్వరికే చైర్మన్ పదవి కట్టబెడతామని రోజా హామీ ఇచ్చారని భువనేశ్వరి ఆరోపిస్తున్నారు. మిగిలిన విషయాలను అన్న కుమార స్వామితో మాట్లాడాలని చెప్పారని ఆమె అన్నారు. వార్డ్ కౌన్సిలర్ భువనేశ్వరి చేస్తున్న ఆరోపణల ప్రకారం ఆమె మంత్రి రోజా అన్న కుమార్ స్వామిని కలిశారు. ముందుగా కుమారస్వామి మునిసిపల్ చైర్మన్ పదవికి 70 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇద్దరి మధ్య బేరం రూ.40 లక్షలకు కుదిరిందని భువనేశ్వరి తెలిపారు.
రెండుదఫాలలో కుదుర్చుకున్న మొత్తాన్ని కుమార స్వామికి అందించానన్నారు. మునిసిపల్ ఎన్నికలు జరిగి మూడు సంవత్సరాలు కావస్తున్నా రెండవ దఫా చైర్మన్ ఇస్తామని చెప్పినమాట నేటికి నెరవేర్చలేదని, అవకాశం ఇవ్వాలని పలు దఫాలు కలిసిన ప్రయోజనం లేకుండా పోయిందని, ఈరోజు రేపు అంటూ కాలాయపన చేస్తూ వచ్చారని ఆమె అంటున్నారు.