టీడీపీకి మరో భారీ షాక్, తాజాగా మరో టీడీపీ నేత అరెస్ట్‌.

స్కిల్‌ స్కాం కేసులో చంద్రబాబు నాయుడికి రిమాండ్‌ విధించిన ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందును అవమానిస్తూ పోస్టులు పెట్టాడు ఓ వ్యక్తి. అయితే అతన్ని ట్రేస్‌ చేసిన పోలీసులు.. ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. సదరు వ్యక్తి టీడీపీ సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ముల్లా ఖాజా హుస్సేన్‌గా ధృవీకరించారు. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి.. ఓ ప్రైవేట్‌కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు ఖాజా హుస్సేన్‌.

ఈ క్రమంలో.. విజయవాడ ఏసీబీ న్యాయమూర్తి హిమబిందును టార్గెట్‌ చేసి సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టులు చేశాడు. టీడీపీ సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి హోదాలోనే పోస్టులు చేసినట్లు అంగీకరించాడతను. అయితే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంటు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను 14 వ నిందితుడిగా చేరుస్తూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. సీఐడీ కోర్టులో అధికారులు మెమో ఫైల్ చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబును సీఐడీ అధికారులు నిందితుడిగా చేర్చారు. కాగా.. ప్రస్తుతం నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు.

తన తండ్రి చంద్రబాబును బెయిల్‌పై బయటకు రప్పించేందుకు తరచూ న్యాయవాదులతో టచ్‌లో ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే నారా లోకేష్‌ను సైతం పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే లోకేష్‌ను సైతం అరెస్ట్ చేసేందుకు వైసీపీ కుట్ర చేస్తోందంటూ టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంటు కేసులో లోకేష్‌ను నిందితుడి చేర్చడం ఆ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *