ఈ మధ్యకాలంలో వేణు స్వామి రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాల గురించి అదే విధంగా సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన విషయాల గురించి పెద్ద ఎత్తున మాట్లాడుతూ వారి జాతకాలను చెబుతూ వార్తలలో నిలుస్తున్నారు. సెలబ్రిటీ జాతకాలను రాజకీయ నాయకుల జాతకాలను చెబుతూ వార్తల్లో నిలుస్తున్నటువంటి వేణు స్వామి మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు.
ఇక ఈయన సెలబ్రిటీల జాతకాలు చెప్పడమే కాకుండా వారి జాతకంలో ఏదైనా దోషం ఉంటే దోష పరిహార పూజలు కూడా చేస్తారు అనే సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలకు హీరోయిన్లకు కూడా ఈయన ప్రత్యేకంగా పూజలు చేసిన విషయం మనకు తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా లో వైరల్ అవుతూ ఉన్నాయి.
ఇకపోతే వేణు స్వామి ఇలా సెలబ్రిటీల జాతకాలను మాత్రమే కాకుండా సాధారణ ప్రజల జాతకాలను కూడా చెబుతాను అంటూ పలు సందర్భాలలో వెల్లడించారు. అయితే ఈయన చేత జాతకం చెప్పించుకోవాలంటే ఎంత మొత్తంలో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది అనే విషయం గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది.