తిరుమల నడకదారిలో బోనులో మరో చిరుత పులి చిక్కింది. లక్ష్మీనరసింహ స్వామి ఆలయం సమీపంలో బోనులో చిరుత చిక్కింది. బాలికపై దాడి చేసిన ప్రాంతం సమీపంలోని బోనులో చిక్కింది. వారం వ్యవధిలో రెండు చిరుతలు బోనులో చిక్కాయి. అయితే కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల గిరులు..! ఈ పేరెత్తితేనే మనస్సులో ప్రశాంతత నిండుతుంది. ఆ స్వామివారి సన్నిధిలో అడుగు పెడితే.. ఆధ్యాత్మికత పరిమళిస్తుంది. ఎప్పుడూ.. ఎంతో ప్రశాంతంగా ఉండే ఏడు కొండల్లో.. కొద్ది రోజులుగా భద్రత కరువైంది.
నడక మార్గంలో వరుసగా చిరుత దాడులు భక్తుల్లో భయాందోళనలు రేపాయి. దైవ దర్శనానికి వెళ్తే ఓ తల్లికి కడుపు కోత మిగిలింది. చిరుత పంజాకి ఆరేళ్ల చిన్నారి బలైంది. అప్పటి వరకు కళ్లెదుట ఉన్న బిడ్డ.. విగత జీవిగా మారడంతో.. ఆ కన్నవారి శోకం ప్రతీ ఒక్కరినీ కలిచివేస్తోంది. అటు.. తిరుమల నడకదారిలో చిరుత అటాక్తో టీటీడీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. నడకమార్గంలో భద్రత పెంచడమే కాకుండా.. పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో ఉంది టీటీడీ. తిరుమలలో అటవీ శాఖ అధికారులు చేపట్టిన ఆపరేషన్ చిరుత ముగిసింది.
వారు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కింది. సరిగ్గా పది రోజులు క్రితం బోనులో చిక్కిన ప్రాంతానికి సమిపంలోనే మరో చిరుత చిక్కింది. చిరుతను బంధించడానికి మూడు ప్రాంతాలలో బోనులు ఏర్పాటు చేశారు అధికారులు. అలిపిరి నడక మార్గంలో మరో చిరుతను అటవీ శాఖ బంధించారు. మోకాలి మిట్ట, లక్ష్మి నరశింహ స్వామి ఆలయం, 7 వ మైలు రాయి వద్ద బోనులను ఏర్పాటు చేసారు. లక్ష్మి నరశింహస్వామి ఆలయం వద్దే బోనులో చిరుత చిక్కింది. 60 రోజులు వ్యవధిలో మూడు చిరుతలను అటవీ శాఖ అధికారులు బంధించారు. కొద్దిరోజులుగా బోన్ దగ్గర వరకూ వచ్చి వెనక్కి వెళ్తోంది చిరుత. ఈనెల 11న లక్షితపై దాడి చేసి చంపిన చిరుత ఇదే అని గుర్తించారు అధికారులు.