ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న వేళ.. అచ్చెన్నాయుడు కుటుంబంలో ఓ వ్యక్తి చనిపోయారు. ఆయన మాతృమూర్తి ఆదివారం నాడు మృతి చెందారు. అచ్చెన్నాయుడి తల్లి కళావతమ్మ (90) ఆదివారం నాడు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని వారి స్వగృహంలో కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితమే వయోభారం కారణంగా కళావతమ్మ అనారోగ్యం బారిన పడ్డారు.
దానికి చికిత్స పొందుతూ ఈ రోజు కన్నుమూశారు. అయితే టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అచ్చెన్న తల్లి కళావతి కన్నుమూశారు. ఆదివారం నాడు 3 గంటల సమయంలో శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ స్వగృహంలో కళావతి తుదిశ్వాస విడిచారు.

వృద్ధాప్యం కారణంగా ఆమె చనిపోయినట్లు కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో ఉండగా అచ్చెన్నాయుడికి విషయం తెలియడంతో హుటాహుటిన ఇంటికి వెళ్లారు. కాగా.. కళావతమ్మ మృతిపట్ల టిడిపి అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు, జిల్లాకు చెందిన సీనియర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం అచ్చెన్న ఇంటికి చంద్రబాబు వెళ్తారని తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఉండగా చంద్రబాబుకు విషయం తెలియగానే వెంటనే అచ్చెన్నకు ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం.