ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు వచ్చింది. ఈ సీజన్ అంతా ఉల్టా.. ఫుల్టా అంటూ సాగుతూ వచ్చింది. ఈసారి బిగ్ బాస్ హౌజ్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. తర్వాత 5 ఇంటిసభ్యులుగా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ ఆరు సీజన్లలో ఏని విచిత్రాలు 7వ సీజన్లలో కనిపిస్తున్నాయి. అయితే బిగ్బాస్ తెలుగు సీజన్ 7 చివరకు వచ్చేసింది. ప్రస్తుతం ఆరుగురు హౌస్లో ఉన్నారు.
ఆదివారం నాటి ఎపిసోడ్లో శోభాశెట్టి ఎలిమినేట్ అయ్యింది. 14 వారాల పాటు ఆమె హౌస్లో ఉంది. తనదైన ఆటతీరుతో ఆకట్టుకుంటూ ఎన్నో సార్లు ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటూ వచ్చింది. అయితే.. చివరికి ఎలిమినేట్ అయ్యింది. ఇక ఆమె రెమున్యరేషన్కు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. అర్జున్ ఇప్పటికే ఫైనల్ కు చేరుకోగా ఆదివారం నాటి ఎపిసోడ్లో ప్రియాంక, ప్రశాంత్, అమర్ దీప్, యావర్, శివాజీ లు ఫైనల్కు చేరుకున్నట్లు ప్రకటించారు నాగార్జున.
ప్రతీ సారి ఐదుగురు మాత్రమే ఫైనల్కు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ ఉల్టా ఫుల్టా అని ముందుగా చెప్పినట్లుగానే ఈ సారి ఫైనల్కు ఆరుగురు చేరుకున్నారు. ఇక ఎలిమినేట్ అయిన శోభాశెట్టి స్టేజీపైన కన్నీళ్లు పెట్టుకుంది. అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఇక 14 వారాల పాటు హౌస్లో శోభా రెమ్యునరేషన్ కింద భారీగా అందుకుందని అంటున్నారు. వారానికి రూ.2.5 లక్షల చొప్పున రెమ్యునరేషన్ మాట్లాడుకున్నట్లు టాక్. ఈ లెక్కన 14 వారాలకు రూ.35లక్షలు సంపాదించినట్లుగా తెలుస్తోంది.