సింహాద్రి అప్పన్న హుండీలో రూ.100 కోట్ల చెక్కు, అకౌంట్‌లో డబ్బు చూసి బిగ్ షాక్.

ఇప్పటి వరకు తిరుమల వెంకటేశ్వరునికి మాత్రమే ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు రావడం జరిగింది కానీ..సింహాద్రి అప్పన్నకు కాదు. విశాఖలోని సింహాద్రి అప్పన్న ఆలయ హుండీలో బొడ్డేపల్లి రాధాకృష్ణ పేరుతో ఆ 100 కోట్ల రూపాయల చెక్ ఉంది. ఆ చెక్‌ శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి పేరుతో చెక్ ఉంది. దేవాలయ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో చెక్ రావడం ఇదే ప్రథమం అంటున్నారు ఆలయ అధికారులు. అయితే విశాఖపట్నంకు చెందిన బోడేపల్లి రాధాకృష్ణ అనే ఒక వ్యక్తికి ఎం వి పి డబుల్ రోడ్ లో ఉన్న కోటక్ మహేంద్ర బ్యాంక్ లో అకౌంట్ ఉంది.

అందులో అతని పేరు మీద ఉన్న చెక్ నెంబర్ 530485009 గల చెక్ పై 100 కోట్ల రూపాయలు అని రాసి, అంకె వేసి హుండీలో వేశారు. హుండీ లెక్కింపు సందర్భంగా ఆలయ సిబ్బంది చెక్ ను కనుగొన్నారు. 100 కోట్ల రూపాయలు అని ఉండటంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురై విషయాన్ని దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ త్రినాధరావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన దానిని పరిశీలించి బ్యాంకు అధికారులను సంప్రదించారు. ఆలయ హుండీలో చాలామంది పాత నోట్లు, పాత చెక్కులు, చినిగిపోయిన నోట్లు వేస్తూ ఉంటారని కొన్ని సందర్భాలలో 500 రూపాయల నోట్లు కూడా వచ్చేవన్నారు.

ఇలా 100 కోట్ల రూపాయలని వేయటం తమను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. బ్యాంకు అధికారులు ఆ చెక్ ను పరిశీలించి బోడేపల్లి రాధాకృష్ణ అనే వ్యక్తి పేరు మీద బ్యాంకు అకౌంట్లో ప్రస్తుతం 17 రూపాయలు మాత్రమే ఉన్నాయని నిర్ధారించారు. ఆ అకౌంట్ పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఫేక్ చెక్ కింద పరిగణించి ఫిర్యాదు చేయాలని బ్యాంక్ అధికారులు నిర్ణయించారు. ఇది చెక్ బౌన్స్ కింద వస్తుందని కేవలం 17 రూపాయలు బ్యాంకు బ్యాలెన్స్ ఉంచుకొని 100 కోట్ల రూపాయలు అంటూ చెక్కుపై రాయటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

అకౌంట్ హోల్డర్ చెక్కు మీద పది అంకె వేసి దాని పక్కన సున్నాలు చుట్టి 100 కోట్లుగా వేశాడన్నది ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇటువంటివి ఆహ్వానించ తగినవి కాదని వీటిపై సమగ్ర దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బ్యాంక్ అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *