మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవాలని హోమం చేస్తున్న రోజా, హోమం చేసే సమయంలో..?

తిరుపతి వెంకన్న సాక్షిగా ఎన్నో హామీలు ఇచ్చారని, చివరికి ఆయనకే శఠగోపం పెట్టారని రోజా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన సభ తర్వాత ఆ కూటమి ఓటమని ఖరారైందని చెప్పుకొచ్చారు. ఎన్నో ఎళ్లుగా పనిచేసిన వారికి టీడీపీ సీటు ఇవ్వలేదని అన్నారు.

మొదట 24 సీట్లు దక్కినందుకు గాయత్రీ మంత్రం అంటూ పవన్ కల్యాణ్ డైలాగ్ చెప్పారని, ఇప్పుడు 21 సీట్లకు ఏమి చెప్పాలో ఆయనకు త్రివిక్రమ్ రాసివ్వలేదేమో అంటూ ఎద్దేవా చేశారు. జనసేన ప్రకటించబోతున్న 21 సీట్లలో పదిమంది టీడీపీ నేతలే ఉంటారని అన్నారు.

ప్రజలంతా 175 స్థానాల్లో వైసీపీని గెలిపిస్తారని రోజా ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 27 నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభిస్తారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *