దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ చేశారని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే.. వైసీపీ మంత్రులు పోటీ చేస్తోన్న నియోజకవర్గాల్లో.. ఆ పార్టీకి పరాభవం ఎదురైంది. పెద్దిరెడ్డి మినహా అందరు మంత్రులు ఓటమి పాలయ్యారు. ఇక నగరిలో మంత్రి ఆర్కే రోజా తన సమీప టీడీపీ అభ్యర్ధి గాలి భానుప్రకాశ్పై 43,505 ఓట్ల తేడాతో ఓటమిపాలైంది.
ఈ తరుణంలో రోజా తన ఓటమిని అంగీకరిస్తూ.. ఎక్స్ వేదికగా ఫలితాలపై ఆసక్తికర ట్వీట్ చేశారు. చిరునవ్వులు చిందిస్తున్న తన ఫోటోను పంచుకుంటూ.. ‘భయాన్ని విశ్వాసంగా… ఎదురు దెబ్బలను మెట్లుగా.. మన్నింపులను నిర్ణయాలుగా.. తప్పులను పాఠంగా నేర్చుకుని, మార్చుకునే వాళ్లే శక్తిమంతమైన వ్యక్తులుగా మారతారు’ అంటూ ఆ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చారు. కాగా, ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అయితే ఆడుదాం ఆంధ్ర పేరిట వంద కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజాతో పాటు, శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధరెడ్డిపై ఈ ఫిర్యాదును ఆత్యా – పాత్యా సంఘం సీఈవో ఆర్డీ ప్రసాద్ తెలిపారు. ఆర్కే రోజా, బైరెడ్డి సిద్దార్ధ రెడ్డిలు ఈ ఆడుదాం కార్యక్రమంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు.