రంగస్థలంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన నాటకాలకు తన రచన అందించిన ప్రశాంత్ నారాయణన్.. మలయాళ సూపర్ స్టార్ తో చాయాముఖి నాటకాన్ని కూడా చేశారు. తన నాటకాలతో ఎన్నో ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ నారాయణన్.. ది సంగీత నాటకం అకాడమీ అవార్డు కూడా అందుకున్నారు. ఇక ఈయన మరణం పట్ల మలయాళ పరిశ్రమ దిగ్బ్రాంతి తెలియజేస్తుంది.
అయితే తాజాగా తమిళ నటుడు, డీఎండీకె అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ కన్నుమూశారు. ఇప్పుడు మరో చేదు వార్త సినీ ఇండస్ట్రీని శోక సంద్రంలో ముంచేస్తుంది. ప్రముఖ మలయాళ థియేటర్ ఆర్టిస్ట్, దర్శకుడు ప్రశాంత్ నారాయణన్ మృతి చెందారు. తిరువనంతపురంలో ఓ ఆసుపత్రిలో అనారోగ్య సమస్యలతో ఆడ్మిట్ అయిన ప్రశాంత్ నారాయణ.. గుండె పోటుతో కన్నుమూశారు.

రంగ స్థల నటుడిగా ఎన్నో ప్రసిద్ది రచనలకు ఆయన ప్రాణం పోశారు. ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్, ముఖేష్ లతో కలిసి చాయా ముఖి అనే నాటకాన్ని తెరకెక్కించారు. 30 ఏళ్ల పాటు ఆయన థియేటర్ ఆర్టిస్టుగా కొనసాగారు. మలయాళ ఇండస్ట్రీ ఆయన మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆయన మృతికి ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తో పాటు పలువురు సంతాపం వ్యక్తం చేశారు.