బంగారం కొనుగోలు చేసేవారికి గొప్ప శుభవార్త. గత వారం రోజులుగా పసిడి, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ లో వస్తున్న మార్పులు బంగారంపై ప్రభావం చూపించడం వల్ల ధరల్లో తరుచూ మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో పండుగలు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు మహిళలు జ్యులరీ షాపుల్లో లేటెస్ట్ ఆర్నమెంట్స్ ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తున్నారు. దీంతో దేశంలో బంగారానికి విపరీతమైన క్రేజ్ తో పాటు డిమాండ్ కూడా పెరిగింది.
నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర నిన్న రూ. 63,270 కాగా ఈరోజు రూ. 220 తగ్గి రూ. 63,050గా కొనసాగుతోంది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 58,000 ఉండగా ఈరోజు రూ.57,800 వద్ద కొనసాగుతోంది. అంటే నిన్నటి ధరతో పోలిస్తే దాదాపు రూ. 200 తగ్గుదల కనిపించింది. ఈవారం మొత్తం ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇక వెండి విషయానికొస్తే నిన్నటి ధరలతో పోలిస్తే కిలోపై రూ.200 తగ్గింది. నిన్న కిలో వెండి ధర రూ. 78,000 కాగా ఈరోజు రూ. 77,800 కు చేరింది. 10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర:- హైదరాబాద్..రూ. 63,050,
విజయవాడ..రూ. 63,050, ముంబాయి..రూ. 63,050, బెంగళూరు..రూ. 63,050, చెన్నై..రూ. 63,600. 10గ్రాముల 22క్యారెట్ బంగారం ధర:- హైదరాబాద్..రూ. 57,800, విజయవాడ..రూ. 57,800, ముంబాయి..రూ. 57,800, బెంగళూరు..రూ. 57,800, చెన్నై..రూ. 58,300. దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు ఇలా..హైదరాబాద్..రూ. 77,800, విజయవాడ..రూ. 77,800, చెన్నై..రూ. 77,800, ముంబాయి..రూ. 76,400, బెంగళూరు..రూ. 73,500.