కుమారీ ఆంటీ ఈ రీల్స్, ట్రోల్స్, మీమ్స్ అన్నీ రాక ముందే ఎంతో ఫేమస్. హైటెక్ సిటీ, దుర్గం చెరువు సమీపంలో ఉండే వారికి ఎంతో బాగా తెలుసు. ఆమె చేతి వంట తినడం కోసం మధ్యాహ్నం 12 గంటల కల్లా క్యూలు కడతారు. నిజానికి క్యూ ఎందుకు కడతారంటే.. కాస్త లేట్ అయినా కూడా ఆమె వద్ద నాన్ వెజ్ మీల్స్ దొరకడం కష్టం. 100 కిలోల చికెన్ వండినా కూడా కేవలం 2, 3 గంటల్లోనే సేల్ అయిపోతుంది. ఆమె ఫుడ్ కు అంత డిమాండ్ ఉంటుంది.
“అందరూ ఆదాయం గురించే మాట్లాడతారు. కానీ, ఖర్చుల గురించి ఎవరూ చెప్పరు. నాన్ వెజ్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు కేజీ చికెన్ రూ.220 నుంచి రూ.240 వరకూ ఉంది. నాన్ వెజ్ లో ఏ ఐటమ్ తీసుకున్నా ధరలు విపరీతంగా ఉన్నాయి. నాకు రోజుకు రూ.60 వేల బిజినెస్ జరుగుతుంది. అందులో రూ.50 వేలు ఖర్చులకు పోతుంది. మిగిలిన రూ.పది వేలల్లో కూడా కట్టాల్సినవి ఉంటాయి. అన్నీ పోను నాకు నెలకు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షలు వరకు మిగులుతుంది” అంటూ ఆవిడ చెప్పుకొచ్చారు.

అయితే ఆవిడ చెప్పిన టోటల్ కౌంటర్ గురించి చెబుతూ రూ.18 లక్షలు సంపాదిస్తున్నారు అని చెప్తున్నారు. కానీ, అందులో రూ.15 లక్షలు ఖర్చులకే పోతాయి అనే విషయాన్ని మాత్రం ఎవరూ హైలెట్ చేయడం లేదు. మొత్తానికి రూ.18 లక్షలు, నెలకు రూ.3 లక్షలు అనే వార్తలపై ఒక క్లారిటీ అయితే వచ్చింది. కుమారీ ఆంటీకి నెలకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర ఆదాయం అయితే వస్తోంది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.