KCRకి గుండె ఆగినంత పని చేసాడు, అసలు ఏం జరిగిందంటే..?

కేసీఆర్ డిసెంబర్ 7న తన వ్యవసాయ క్షేత్రంలో కాలుజారి పడిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఎడమ తుంటి భాగంలో గాయమైంది. వెంటనే యశోద ఆస్పత్రికి ఆయనను తరలించారు. పరీక్షలు చేసిన డాక్టర్లు తుంటి ఎముకకు గాయమైందని గుర్తించారు. అనంతరం సర్జరీ చేశారు. అయితే యశోద ఆస్పత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు.

డిసెంబర్ 8న సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌కు తుంటి ఎముక సర్జరి జరిగిన విషయం తెలిసిందే. సర్జరీ తరువాత కోలుకున్న కేసీఆర్‌ను ఈరోజు డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. దీంతో ఆయన బంజారాహిల్స్ లోని నందినగర్ నివాసానికి వెళ్లారు. కేసీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నారని తెలిసి ఆయన అభిమానులు భారీగా ఆస్పత్రికి చేరుకున్నారు.

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్‌ను ప్రత్యేక వాహనంలో నందినగర్‌లోని నివాసానికి తీసుకెళ్లారు. కేసీఆర్ వాహనంలో కేటీఆర్, హరీశ్ రావులు ఉన్నారు. వీల్‌చైర్‌లో వాహనం వరకు వచ్చిన కేసీఆర్ తన నివాసానికి బయలుదేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *