భారతీయ పురాణాలలో కాకులకు ప్రాధాన్యత కలదు. పురాణాల ప్రకారం కాకి శని దేవుని యొక్క వాహనంగా ఉంది. ఈ కారణంగా దీనికి పూజలు చేయడం జరుగుతున్నది. అయితే చాలామంది జీవితంలో కష్టపడి డబ్బులు సంపాదించాలని రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఇదే సమయంలో పెట్టుబడి పెట్టి ఓవర్ నైట్ లోనే డబ్బులు సంపాదించాలని అనుకుంటారు. ఈ రకంగా తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలని కొంతమంది పక్కదారులు వెతుక్కుని జీవితాలు నాశనం చేసుకుంటారు.
అయితే అదృష్టం అనేది కలిస్తే ఎవరు ఆపలేరు అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో కొన్ని అదృష్టాలు ప్రకృతి రూపంలో మనకు అందుబాటులోనే ఉంటాయి. దీనిలో భాగంగానే కాకి పెట్టే గూడు నందు ఒక పుల్ల ఉంటుందట దాన్ని గాని సంపాదిస్తే సదరు వ్యక్తి జీవితం ఒక్కసారిగా ఓవర్ నైట్ లోనే అదృష్టాన్ని అందుకోవటం జరుగుతుందట. అదే సంజీవని పుల్ల. కాకి పెట్టే గూడులో ఈ పుల్ల దొరుకుతుందట. ఎక్కువగా అడవుల్లోనే నివసించే కాకులు ఈ పుల్లను సంపాదించి తమ గుడు నందు పెట్టుకుంటాయట.
ఈ పుల్లను ఎలా కనిపెట్టాలంటే కాకి గూడు నందు దొరికిన పుల్లలను పోగేసి సాగే నదిలో వేస్తే.. సంజీవని అనే పుల్ల నదికి ఎదురుగా ఈదుతుందట. మిగతా పుల్లలు కొట్టుకొని పోతే సంజీవని పూలు మాత్రం నదికి ఎదురు ఈదుతూ.. పాము ఆకారంలో తన ఆకృతిని మార్చుకుంటుందట. ఆ పుల్ల ఇంటికి తీసుకొచ్చి శని దేవుడికి ప్రత్యేకమైన పూజలు చేయడం ద్వారా అదృష్టం కలిసొచ్చి సదరు గృహంలో ఉండే వారందరికీ అత్యధికమైన డబ్బులు ధన వృద్ధి జరుగుతుందట. దరిద్రం మొత్తం పోతుందట.