జయసుధ మొదటి భర్త ఎవ‌రో తెలుసా..? ఎందుకు విడాకులు ఇచ్చేసిందంటే..?

అప్పటి అగ్ర హీరోలందరితో అందరితో కలిసి నటించిన జయసుధ, తన కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలో ఒక వ్య‌క్తితో ప్రేమలో పడింది. ఆ ప్రేమ ఆ తరువాత ఆమెకు పలు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. చాల మంది జయసుధ భర్త కేవలం నితిన్ కపూర్ అనే అనుకుంటారు. అయితే జయసుధ నితిన్ కపూర్ కన్నా ముందు వడ్డే నవీన్ తండ్రి వడ్డే రమేష్ పెళ్లి చేసుకున్నారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదు. ఇక జయసుధ మొదటి భర్త ఎవరు అనే విషయానికి వస్తే ఆయన పేరు కాకర్లమూడి రాజేంద్రప్రసాద్.

ఈయన ఓ వ్యాపారవేత్త ఓ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమగా మారింది. అయితే వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో జయసుధ గుడిలో రహస్య వివాహం చేసుకున్నారు. ఇక చేసేదేమి లేక పెద్దలు కూడా వీరు పెళ్లికి అంగీకరించారు. తిరిగి వీరిద్దరి వివాహం ఎంతో ఘనంగా చేయడంతో ఎంతో మంది సినీ ప్రముఖులు కూడా వివాహానికి హాజరయ్యారు.

ఇక పెళ్లయిన తర్వాత జయసుధ సినిమాలలో నటిస్తున్నప్పటికీ ఈయన వ్యాపారాలు చూసుకుంటూ ఉండేవారు అయితే వీరిద్దరూ ఎంత తొందరగా ప్రేమలో పడ్డారో అంతే తొందరగా విడాకులు తీసుకున్నారు. రాజేంద్రప్రసాద్ వ్యక్తిగతంగా జయసుధను బాగా టార్చర్ చేయడంతో ఆమె అతని టార్చర్ భరించలేక కొద్ది రోజులపాటు చెన్నైలోనే విజయవాహిని స్టూడియోలో తల దాచుకున్నారట. ఈ విధంగా వీరిద్దరి కాకర్లమూడి రాజేంద్రప్రసాద్ బాగా టార్చర్ చేయడంతోనే ఈమె విడాకులు ఇచ్చారని అనంతరం నితిన్ కపూర్ నీ పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *