బిగ్‌బాస్ హౌస్ ముందు గీతూరాయ‌ల్ కారు ధ్వంసం, దీంతో వార్నింగ్స్ ఇస్తూ..!

బిగ్‌బాస్ కంటెస్టెంట్ గీతూ రాయ‌ల్ కారుపై ఫ్యాన్స్ ఎటాక్ చేశారు. వెనుక‌వైపు అద్దాల‌ను ప‌గ‌ల‌గొట్టారు. ఆమెతో పాటు అశ్విని కారును కూడా ఫ్యాన్స్ డ్యామేజ్ చేశారు. అభిమానుల తీరు ప‌ట్ల ఆమె అస‌హ‌నానికి లోన‌య్యింది. అయితే హౌస్ లో ప్రశాంత్ ని ఎవరన్నా ఏమన్నా అంటే పల్లవి ప్రశాంత్ అభిమానులు వేరే కంటెస్టెంట్స్ పై, వాళ్ళ ఫ్యామిలీలపై సోషల్ మీడియాలో అసభ్య పదాలతో కూడా దాడి చేశారు. సందీప్ ఫ్యామిలీ డైరెక్ట్ గా వచ్చి ప్రశాంత్ ఫ్యాన్స్ మమ్మల్ని వేధిస్తున్నారు అని చెప్పారు.

ఫైనల్ ఎపిసోడ్ రోజు బిగ్ బాస్ హౌస్ ముందు అభిమానులు ఉంటారని తెలిసిందే. వాళ్ళ ఫేవరేట్ కంటెస్టెంట్ బయటకి వచ్చాక ఊరేగింపుగా తీసుకెళ్తారు. అయితే నిన్న రాత్రి అన్నపూర్ణ స్టూడియో బయట ప్రశాంత్ ఫ్యాన్స్, ప్రశాంత్ మనుషులు భారీగా వచ్చారు. ప్రశాంత్ కంటే ముందే బయటకి వచ్చిన పలువురు కంటెస్టెంట్స్ పై, వారి కార్లపై పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేశారు. రాళ్లతో కార్ అద్దాలు పగలగొట్టారు. అమర్ దీప్, అశ్విని, హర్ష, శోభాశెట్టి, గీతూ.. ఇలా పలువురు కంటెస్టెంట్స్ కార్లపై పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేసి కార్ అద్దాలు పగలకొట్టి డ్యామేజ్ చేశారు. దీనిపై కంటెస్టెంట్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

గీతూ అయితే అక్కడ ఉన్న యూట్యూబ్ మీడియాతోనే ఈ దాడిపై మాట్లాడింది. తర్వాత తన సోషల్ మీడియాలో కూడా తన కార్ పగలకొట్టిన వాడ్ని పట్టుకుంటే పదివేలు ఇస్తా అని పోస్ట్ చేసింది. ఇక అశ్విని తన కార్ ని డ్యామేజ్ చేసారంటూ, కొత్త కార్ అంటూ వీడియో పోస్ట్ చేసింది. దీనిపై పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఇక ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ ఫ్యామిలీ కార్ పై కూడా దాడి చేసి బయటకి దిగమంటూ రచ్చ చేశారు. దీంతో అమర్ ఫ్యామిలీ భయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *