చంద్రబాబుని జైల్లో పెట్టిన జగన్ ని ప్రపంచం వదిలిన నేను వదలను : సీతక్క

ములుగు మండలం గుర్తూరు తండా గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో సీతక్క బీఆర్ఎస్‌ పార్టీ తీరుపై, ముఖ్యంగా కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తెలంగాణను లూటీ అయ్యిందని ఆరోపించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ఏర్పడిందని మండిపడ్డారు.

కేసీఆర్‌ కటించిన ప్రగతి భవన్‌లో కేటీఆర్ పెంచుకునే కుక్కలకు రూ.12 లక్షలతో ఇండ్లు కట్టించడం ఏమిటని సీతక్క విస్మయం వ్యక్తం చేశారు. ఇష్టారాజ్యంగా నిధులు ఖర్చు చేసి తెలంగాణ ఖజనాను ఖాళీ చేశారని విమర్శించారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది అని ఆరోపించారు.

మారుమూల గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. పట్టా భూములు, పంటలకు సాగునీరు అదేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను పక్క అమలుచేస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. పేదలను గుర్తించి రూ.5 లక్షలతో ఇల్లు కట్టిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *