శాసనసభ సమావేశాలను బాలకృష్ణ షూటింగ్ అనుకుంటున్నారా అంటూ.. మీసాలు తిప్పుతూ, తొడలు కొడుతున్నాడన్నారని రోజా మండిపడ్డారు. ఏరోజూ ప్రజా సమస్యలపై ప్రస్తావించని బాలకృష్ణ.. బావ కళ్లలో ఆనందం చూడటానికి అసెంబ్లీకి వచ్చినట్టున్నాడన్నారని ఎద్దేవా చేసారు. తండ్రి ఎన్టీఆర్ మీద చెప్పులు వేసినప్పుడు చంద్రబాబుపై బాలకృష్ణ మీసాలు తిప్పి ఉంటే రాష్ట్ర ప్రజలు హర్షించేవారని రోజా వ్యాఖ్యానించారు.
అయితే టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్ట్ కాగానే ఆ పార్టీ నేతలకు పిచ్చ పట్టిందని మంత్రి రోజా వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి మాట్లాడుతూ.. బాలకృష్ణ ఎందుకు ఈ రోజు సభ నుంచి పారిపోయారని ప్రశ్నించారు. చర్చకు ఎందుకు ముందుకు రాలేదని అన్నారు. ‘‘కేస్లు కొట్టేయాలని మీ బావ వేసిన కేస్ను కోర్ట్ కొట్టేసింది.
ఇప్పుడు మీ బావ కోసం హైకోర్టుకు వెళ్లి మీసం మెలేసి, తొడకొట్టు’’ అంటూ విరుచుకుపడ్డారు. ప్రజాధనాన్ని చంద్రబాబు దోచుకున్నారని.. అందుకే ప్రజలు, యువత రోడ్డు మీదకు రాలేదని అన్నారు. కోర్ట్లు రిమాండ్కు పంపిస్తే… జగన్ ఎందుకు క్షమాపణ చెప్పాలని మంత్రి రోజా నిలదీశారు.