అనసూయ తన బిజీ లైఫ్ లో ఏ మాత్రం విరామం దొరికినా ఫ్యామిలీతో ఫుల్లుగా ఎంజాయ్ చేసే అనసూయ.. ఇప్పుడు విదేశాలకు వెళ్ళింది. భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి సరదాగా షికార్లు కొడుతూ ఎప్పటికప్పుడు ఈ మూమెంట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. అయితే తాజాగా అనసూయ పోస్ట్ చేసిన ఫోటోలు మాత్రం టాప్ నాచ్ అనే చెప్పాలి. ఒక విదేశీ రెస్టారెంట్ లో ఎంజాయ్ చేస్తూ ఒక చేతిలో డ్రింక్ గ్లాస్ తో ఎదపై టాటూ తో ఫోటోలకు ఫోజులిచ్చింది అందాల తార అనసూయ. రోజు రోజుకి అందాల డోస్ పెంచుతున్న అనసూయ ఫోటోలు చూసి ఫిదా కానీ కుర్రకారు లేరనే చెప్పాలి.
ఇక ఆమె ఫోటోలు పెట్టడం ఆలస్యం కామెంట్స్ తో ఆమె కామెంట్ బాక్స్ మోత మోగుతుంది. ఈ ఫోటోలకు కూడా అటు పాజిటివ్ గా ఇటు నెగిటివ్ గా కామెంట్స్ వార్ నడుస్తోంది. బహుశా అనసూయ కూడా వాటిని ఎంజాయ్ చేస్తూ ఉండవచ్చు. ఎలాగైనా సరే మీడియా లైమ్ లైట్ లో ఉండటం అనేది సినిమా నటీనటులకు చాలా అవసరం. ఆ కోణంలో చూస్తే అనసూయ కెరీర్ కు ఇవన్నీ బాగానే ఉపయోగపడుతున్నాయి. ఎంతైనా జబర్దస్త్ బ్యూటీ కదా ఈ మాత్రం తెలివితేటలు లేకపోతే ఎలా ? ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే ఫుల్ స్వింగ్ తో ఉన్నట్లు తెలుస్తుంది. పుష్ప 2 లో మంచి రోల్ చేస్తున్న అనసూయ.

బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రాబోతున్న భగవత్ కేసరి సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాలయ్య మూవీ అంటే మాస్ మసాలా సాంగ్ కచ్చితంగా ఒకటి ఉండాలి. ఈ మధ్య అనిల్ రావిపూడి కూడా ఈ ట్రెండ్ ను ఫాలో అవుతున్నాడు. దీనితో ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం ముందుగా తమన్నా ను అనుకున్నారు. కానీ ఆమె ఒక సినిమాకి తీసుకునే రెమ్యూనరేషన్ అడగటంతో నిర్మాతలు ఇప్పుడు అనసూయ వైపు చూసినట్లు తెలుస్తుంది.
గతంలో రెండు ఐటెం సాంగ్స్ చేసిన అనసూయ కు ఇటు యూత్ లో మంచి క్రేజ్ ఉండటంతో ఆమె అయితే బెస్ట్ ఛాయిస్ అనుకున్నట్లు సమాచారం. మరో పక్క కొన్ని కీలక సినిమాల్లో పవర్ఫుల్ లేడీ ఓరియంట్ రోల్స్ చేస్తూ దూసుకెళ్తుంది ఈ చిన్నది.