అన్షు.. ప్రభాస్, నాగార్జున లాంటి హీరోలతో నటించింది. వీటిలో ఒకటి ఇండస్ట్రీలో బెస్ట్ ఫిల్మ్ కాగా, మరొకటి యావరేజ్గా నిలిచింది. వీటి తర్వాత ఈమెకు ఛాన్సులు వచ్చాయి గానీ ఒకే ఒక్క కారణంతో యాక్టింగ్కి పూర్తిగా దూరమైపోయింది. ప్రస్తుతం ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. అయితే టాలీవుడ్ టాప్ హీరో నాగార్జున నటించించిన ‘మన్మథుడు’ చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది అన్షు.
ఈ సినిమాలో మహి పాత్రలో చాలా క్యూట్ గా మాట్లాడుతూ ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమా విజయం తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాఘవేంద్ర’ మూవీలో కూడా చేసింది. శివాజీ హీరోగా నటించిన ‘మిస్సమ్మ’ చిత్రంలో చిన్న పాత్రలో కనిపించింది. ఆ తర్వాత తమిళ హీరో ప్రశాంత్ సరసన ఓ సినిమాలో అవకాశం వరించింది.

అయితే హీరోయిన్గా మంచి క్రేజ్ వస్తున్న సమయంలోనే.. అన్షు అంబాని సినిమాలకు దూరమైంది. సచిన్ సాగ్గర్ అనే వ్యక్తి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఇద్దరు పిల్లలకి తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తోంది. అన్షూ తన ఇద్దరి పిల్లలు, భర్తతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.