కుమారీ ఆంటీ అసలు పేరు దాసరి కుమారి. కైకలూరు సమీపంలోని తారమకొల్లులో పుట్టారట. 4వ తరగతి వరకు చదువుకున్నారు. ఇంట్లో ఆర్ధిక పరిస్థితి బాగోకపోవడంతో తల్లిదండ్రులతో పొలం పనులకు వెళ్లేవారట. పొలం పనులతో పాటు గుడివాడ మాంటిస్సోరి స్కూల్లో టైలరింగ్ నేర్చుకున్నారట. అలా టైలరింగ్ నేర్చుకునే క్రమంలో తనను చూసి ఇష్టపడి వ్యక్తి ఇంట్లో వారితో మాట్లాడి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లాడారట.
అయితే సోషల్ మీడియాతోపాటు ప్రముఖ మీడియా ఛానళ్లలోనే ఈ వార్త ప్రసారం కావడం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. తెలంగాణ సీఎం రేవంత్ కుమారి ఆంటీ విషయంపై వెంటనే స్పందించారు. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను అక్కడే నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించాలని, అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అంతేగాక, ఆమె స్టాల్ను సందర్శిస్తానని కూడా సీఎం రేవంత్ చెప్పారు.
ఈ నేపథ్యంలో కుమారి ఆంటీ ఆనందం వ్యక్తం చేశారు. బండిని సీజ్ చేయడంతో 50 వేల రూపాయల ఫుడ్ వేస్ట్ అయ్యిందని వాపోయారు. తన కొడుకును పోలీసులు కొట్టారని, మళ్లీ హోటల్ తెరుస్తామని అనుకోలేదన్నారు. తనలాంటి చిన్న స్ట్రీట్ ఫుడ్ మహిళపై సీఎం స్పందించడం గొప్ప విషయమన్నారు. అందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.