కేంద్ర బడ్జెట్ ప్రతుల్ని బ్రిటిష్ కాలం నుంచి ప్రవేశపెడుతుండగా.. 2018 వరకు దీనిని లెదర్ సూట్కేసులో మాత్రమే తీసుకొచ్చేవారు. అయితే 2019లో నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా తొలిసారే ఈ సంప్రదాయానికి చెక్ పెట్టారు. ఆమె ఈ బడ్జెట్ ప్రతుల్ని బాహీ ఖాతాగా పిలిచే ఎరుపు రంగ క్లాత్ బ్యాగ్లో తీసుకొచ్చారు.
దీనిపై జాతీయ చిహ్నం ముద్రించి ఉంటుంది. దీంతో భారతీయ సంస్కృతికి తెరతీశారు. అయితే ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అలాగే మీ డబ్బులపై ప్రభావం చూపే కొన్ని మార్పులు రాబోతున్నాయి. అందుకే ఎలాంటి మార్పులు వస్తున్నాయో ప్రతి ఒక్కరు కచ్చితంగా తెలుసుకోవాలి.
ఫిబ్రవరి తొలి రోజు నుంచి అమలు కానున్న కొత్త నిబంధనల్లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ పాక్షిక ఉపసంహరణ, ఐఎంపీఎస్ కొత్త అప్డేట్, ఎస్బీఐ హోమ్ లోన్ క్యాంపెయిన్ ఆఫర్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ స్పెషల్ ఎఫ్డీ డెడ్లైన్ తో పాటు లేటెస్ట్ సావెరిన్ గోల్డ్ బాండ్ల జారీ వంటివి ఉన్నాయి.