సహజంగా శని పేరు వింటేనే అందరూ భయపడుతూ ఉంటారు. ఎవరైనా దరిద్రంతో ఇబ్బందులు పడుతూ ఉంటే, వీడికి పట్టిన శని వదలడం లేదు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే శని అంతటి ప్రభావవంతమైన గ్రహంగా చెబుతారు. అయితే శనివారం రోజున ఇతర దేవుళ్లను సైతం కొలిచేవాళ్లు చాలామంది ఉంటారు. శనివారం రోజున కొన్ని పనులు చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. హనుమంతుడిని శనివారం రోజున పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
శనివారం రోజున హనుమాన్ చాలీసా చదవడం వల్ల హనుమంతుని అనుగ్రహం మనపై ఉంటుంది. హనుమంతుడిని ఎవరైతే పూజిస్తారో వాళ్లకు ఉన్న బాధలు, కష్టాలు సులభంగా తొలగిపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఉదయాన్నే స్నానం చేసి కొబ్బరికాయ తీసుకుని హనుమంతుని ఆలయానికి వెళ్లి భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజిస్తే శుభ ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. శ్రీరామ రక్షా స్త్రోత్ర పఠనం ఎవరైతే చేస్తారో వాళ్లకు దోషాలు సులభంగా తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది.
ఎరుపు రంగు లేదా కాషాయ రంగు దుస్తులను ధరించి హనుమంతుడిని పూజిస్తే కుజ దోషం పోవడంతో పాటు శుభ ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుంది. పెళ్లి కాని వాళ్లు ఈ విధంగా చేయడం ద్వారా అనుకూల ఫలితాలను పొందవచ్చు. హనుమంతుడిని ఎవరైతే పూజిస్తారో వాళ్లు ఆయువును, ఐశ్వర్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. హనుమంతుడిని పూజించడం వల్ల భుత, ప్రేత, పిశాచాల బాధలు సైతం తొలగిపోతాయి. హనుమంతుని అనుగ్రహం ఉంటే కోరుకున్న కోరికలు నెరవేరతాయి. ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల వేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.