ప్రపంచవ్యాప్తంగా హిట్ అయ్యి.. బిగ్గెస్ట్ రియాలిటీ షో అయ్యింది. ఇక ఈ షో ఇండియాలోని పలు లాంగ్వేజ్స్ లో కూడా ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగు, తమిళంలో సీజన్ 7 జరుగుతుంది. ఈ రెండు భాషల్లో ఈ సీజన్ చాలా హోరాహోరీగా జరుగుతుంది. ఇటు తెలుగులో, అటు తమిళంలో కూడా కంటెస్టెంట్స్ మధ్య ఓ రేంజ్ ఫైట్ జరుగుతుంది. అయితే బుధవారం ప్రసారమైన ఎపిసోడ్లో ఈ స్కిట్ మొత్తం నడించింది.
ఆ తర్వాత గులాబీపురం, జిలేబీపురం మధ్య గుడ్లను బ్యాలెన్స్ చేసే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో జిలేబీపురం హౌస్మేట్స్ విజేతలుగా నిలిచారు. గ్రహాంతరవాసి స్కిట్ గురువారం కూడా కొనసాగనున్నట్లు తాజా ప్రోమోలో చూపించారు. ఇందులో టేస్టీ తేజ.. ఈ రోజు తన పెళ్లి రోజని, ఫస్ట్ నైట్ రోజు ఇదే డ్రెస్ వేసుకున్నా అంటూ ఊర్లో చెప్పుకోవడమే కాకుండా.. శోభాశెట్టిని కూడా ఆటపట్టించాడు. అయితే శోభా మాత్రం పదే పదే అలా అనొద్దంటూ తేజాను కొట్టడం కనిపించింది. మరోవైపు శివాజీ రెండు ఊర్లకు పెద్ద మనిషిగా వ్యవహరిస్తూనే.. జిలేబీపురం సర్పంచ్ ప్రియాంకాకు పులిహోర కలుపడం కనిపించింది.
‘‘నువ్వు నడుస్తుంటే.. నెమలి నాట్యమాడుతున్నట్లే ఉంది’’ అని శివాజీ అన్నాడు. మధ్యలో ఎందుకో ఒక బిగ్ బాస్ ఒక బీప్ కూడా వేసుకున్నట్లు కనిపించింది. మొత్తానికి ఈ స్కిట్ పెద్దలకు మాత్రమే అన్నట్లుగా ఉంది. తాజా సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ రెండూ ఊర్లకు మధ్య మరో పోటీ పెట్టినట్లు సమాచారం. అందులో కూడా జిలేబీపురమే గెలిచి కెప్టెన్సీకి అవసరమైన ఫైనల్ టాస్క్కు అర్హత పొందినట్లు తెలిసింది.