హీరో సిద్ధార్థ్ మాస్ వార్నింగ్, ఒళ్ళు దెగ్గర పెట్టుకుని మాట్లాడు..!

బాయ్స్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సిద్దార్థ్ కి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. సౌత్ ఇండస్ట్రీలో సిద్ధార్థ్ గ్రాఫ్ పూర్తిగా పడిపోవడంతో పలు చిత్రాల్లో సహాయ నటుడిగా కనిపించారు. ఈమధ్యనే తమిళంలో చిత్త అనే సినిమా చేసిన సిద్ధార్థ్ ఆ సినిమాను కన్నడ, మలయాళ రాష్ట్రాల్లో కూడా రిలీజ్ చేశారు. అయితే తాజాగా హైదరాబాద్ ప్రెస్ మీట్ లో ఈ విషయం గురించి సిద్దార్థ్ స్పందించాడు.

ఆయన మాట్లాడుతూ కర్ణాటక వెళ్లి ప్రెస్ మీట్ పెడితే నువ్వు ఎవడ్రా తమిళోడివి గెట్ అవుట్ అన్నారు నన్ను. ఏదో ఒక రోజు ఒక సినిమా నేను తీస్తాను, అమ్మ తోడు ఇంత కన్నా బెటర్ సినిమా నేను తీయలేను అని చెప్పే పరిస్థితి నాకు వస్తుందని సిద్దార్థ్ అన్నారు. ఇక ఆయన అసలు ఈ విషయంలో ఏం జరిగిందో కూడా వివరించారు. ‘చిన్నా’ సినిమా నిర్మాతగా విడుదలకు ముందే నేను ఈ సినిమాను చాలా మందికి చూపించాలని అనుకుని చెన్నైలో కొంతమందికి చూపించా,

బెంగుళూరులోని మీడియాకు సినిమాను చూపించాలని ప్లాన్‌ చేశానని అన్నారు. రిలీజ్​కు ముందే 2000 మంది విద్యార్థులకు ఈ సినిమాను చూపించాలనుకున్నా కానీ, బంద్‌ కారణంగా మేం అన్నింటినీ రద్దు చేశాం, అందువల్ల మాకు భారీ నష్టం వాటిల్లిందని అన్నారు. మంచి సినిమాను అక్కడి ప్రజలతో పంచుకోలేకపోయామని కెమెరాల ముందు జరిగిన దాని గురించి నేను మాట్లాడదలచుకోవడం లేదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *