మోడలింగ్ రంగంలో తనదైన అందచందాలతో మెప్పించిన దిశా పటానీ సినిమా వాళ్లకు బాగా ఫోకస్ అయిపోయింది. దీంతో ఆమెకు ఎన్నో భాషల్లో మూవీ ఛాన్స్లు వచ్చాయి. అయితే దిశా పటానీ విషయానికొస్తే.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లోఫర్’ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. ఈ సినిమా చూసినపుడు ఎవరూ అనుకోలేదు ఈ భామ బాలీవుడ్ టాప్ హీరోయిన్ అవుతుందని.. అంతేకాదు ఎప్పటి కపుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో రెచ్చిపోవడం ఈ భామకు అలవాటైయింది.
బాలీవుడ్ నుంచి వచ్చిందని తెలుసు.. మోడలింగ్ బ్యాగ్రౌండ్ అని కూడా తెలుసు కానీ మరీ ఇంతగా రెచ్చిపోవడం ఒక్కటే పనిగా పెట్టుకుంటుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. తాజాగా కిర్రాక్ ఫోజులిస్టూ పరవశంలో తేలిపోతుంది. ప్రస్తుతం ఈమె ప్రభాస్ ప్యాన్ ఇండియా సినిమా ‘ప్రాజెక్ట్ K’ ‘కల్కి 2898 AD’ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. అంతేకాదు ఎప్పటి కప్పుడు సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ను ఫాలో కావడం ఈ అమ్మడి స్టైల్.
దశాదిశా లేని దిశా పటానీ అందాల ఆరబోత చూసి అభిమానులు కూడా ఫిదా అయిపోతున్నారు.ఈమె దాదాపు 60 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఓ వైపు హాట్ ఫోటోషూట్స్ మాత్రమే కాదు.. ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటించడం కూడా దిశాకు అలవాటు. అయినా హీరో హీరోయిన్లు ఎప్పటికప్పుడు తమ అభిమానులతో ఛాటింగ్ చేస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో వాళ్లతో కలిసి ముచ్చట్లు పంచుకుంటూనే ఉంటారు. తమకు సంబంధించిన విషయాలను వాళ్లకు చెప్తూ వాళ్ళతో ఎప్పుడూ కాంటాక్ట్ అవుతుంటారు.