ప్రతిరోజూ స్నానం చేసే ఆడవాళ్లు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే.

మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినవి జలము, అగ్ని. అగ్నితో శుద్ధి చేసుకోవడం వీలు బడదు. అగ్ని యందలి దాహక శక్తి మనల్ని దహింప చేస్తుంది కనుక జలముతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది. హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి చెప్పబడింది. అయితే ఉదయం 6 నుంచి 8 గంటల నుంచి మనుషులు సాధారణంగా స్నానం చేసే సమయం. ఈ సమయంలో స్నానం చేయటం వల్ల అదృష్టం ఐక్యత సంతోషం పెరుగుతాయని ధర్మశాస్త్రంలో వివరించబడింది. ఉదయం ఎనిమిది గంటల తర్వాత స్నానం చేయడానికి రాక్షస స్నానంగా పరిగణిస్తారు.

కాబట్టి ఎనిమిది గంటలలోపు స్నానం చేయండి. కుదరకపోతే గనక సూర్యాస్తమయానికి ముందు స్నానం చేయాలి. అంటే శాస్త్రాల ప్రకారం ఉదయం 8 గంటల తర్వాత స్నానం చేస్తే కష్టాలు పెరుగుతాయి. ఆర్థికపరంగా నష్టాలు పెరిగి పేదరికానికి దారి తీసే అవకాశం కూడా ఉంటుంది. అయితే శాస్త్రాల ప్రకారం పురుషులు ప్రతిరోజు తల స్నానం చేయవచ్చు. అయితే అలా కుదరని వారు బుధవారం తప్పనిసరిగా తల స్నానం చేయాలి. మగవారు స్నానం చేసే సమయంలో నగ్నంగా ఉండకూడదు. ఒంటిమీద కనీసం ఏదైనా బట్ట ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నీటిలో జల దేవత ఉంటుంది. కాబట్టి నగ్నంగా స్నానం చేస్తే జలదేవతకు కోపం వచ్చి మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తుంది.

మరోవైపు స్నానం చేసిన తర్వాత చాలామంది మగవాళ్ళు శరీరాన్ని అంతా కూడా శుభ్రం చేసుకొని దాన్ని నడుముకు చుట్టుకుంటూ ఉంటారు. అయితే అలా చేయటం వల్ల దరిద్రం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి స్నానం చేసిన తర్వాత కట్టుకునే వస్త్రం పొడిగా ఉండేలా చూసుకోవాలి. అలా చేయకుండా స్నానం ముగిసిన తర్వాత బకెట్లో కొంత నీరు నింపి పెట్టాలి. ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానం కాబట్టి మన పెద్దవాళ్ళు మనకు శుక్రవారం అలవాటు చేశారు. కానీ ధర్మ శాస్త్రాల ప్రకారం ఆడవాళ్లు శుక్రవారం లేదా మంగళవారం తలస్నానం చేయకూడదు ఎంతో తప్పనిసరి పరిస్థితి అయితేనే చేయాలి. ఆడవారు ముఖ్యంగా తమ జీవితంలో పసుపు, కుంకుమలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు.

సౌభాగ్యం కలకాలం చల్లగా ఉండాలంటే తల స్నానం చేసే విధానం.. ఎప్పుడు చేయాలి అనేది కూడా తెలుసు ఉండాలి. స్త్రీలు శనివారం తలంటు స్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది. బుధవారం చేస్తే భార్యాభర్తల మధ్య ఐక్యత బాగుంటుంది. సోమవారం తల స్నానం చేస్తే సౌభాగ్యవంతులుగా ఉంటారు. మీకు ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది. భోజనం చేయగానే స్నానం చేయటం అనేది అలవాటుగా ఉన్నట్లయితే మీరు కచ్చితంగా అలవాటును మార్చుకోవాలి. భోజనానికి ముందు స్నానం చేయాల్సి ఉంటుంది. కానీ భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. ఈ విధంగా చేస్తే అది ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే శాస్త్రాల ప్రకారం కూడా ఈ విధంగా చేయడం తప్పు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *