చంద్రబాబు కు బెయిల్ రాకపోవడానికి కారణం ఎవరో తెలుసా..?

చంద్రబాబును మరో ఐదు రోజుల పాటు కస్టడీకి కోరుతూ ఈ నెల 25న సీఐడీ తరపు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. మరోవైపు టీడీపీ చీఫ్ చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు ఈ నెల 14వ తేదీన పిటిషన్లు దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్ ఉన్న సమయంలో బెయిల్ పిటిషన్ పై విచారించవద్దని సీఐడీ తరపు న్యాయవాదులు కోరారు. అయితే బెయిల్ పిటిషన్ ను ముందుగా దాఖలు చేసినందున ఈ పిటిషన్ పైనే ముందుగా విచారణ నిర్వహించాలని కోరారు.

అయితే ఈ నెల 25న ఈ రెండు పిటిషన్లపై విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. ఈ నెల 26న ఈ రెండు పిటిషన్లపై విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. తనను అవినీతిపరుడుగా ముద్ర వేయడంలో చంద్రబాబు పాత్ర అధికమని ఏపీ సీఎం జగన్ అనుమానిస్తున్నారు. తనను అన్యాయంగా కేసుల్లో ఇరికించి పైశాచిక ఆనందం పొందుతున్న ప్రతి ఒక్కరి అంతు చూడడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. తనపై గోబెల్స్ ప్రచారం చేయడంలో ముందున్న రామోజీరావు తో పాటు తన కేసుల్లో ప్రమేయం ఉన్న కుటుంబాలను సైతం జగన్ విడిచిపెట్టలేదు.

నాడు తనపై కేసులు వేయడంలో కీలక పాత్ర పోషించిన కింజరాపు ఎర్రన్నాయుడు కుటుంబాన్ని సైతం జగన్ వెంటాడిన సంగతి తెలిసిందే. ఎర్రన్న సోదరుడు అచ్చెనాయుడుని ఎలా టార్గెట్ చేశారో అందరికీ తెలిసిన విషయమే. తాజాగా చంద్రబాబు పై పడ్డారు. ఒక్క చంద్రబాబుతో సరిపెట్టడం లేదు. ఆయన కుమారుడు తో పాటు కుటుంబ సభ్యులపై సైతం కేసులు నమోదు చేయించాలన్న కృత నిశ్చయంతో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాజకీయ లాభనష్టాలను పరిగణలోకి తీసుకోకపోవడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *