ఇమ్మానుయేల్ చనిపోయాడని తెలిసి ఎమోషనల్ అయిన వర్షా.

ఇమ్మాన్యుయెల్, వర్షిణి జోడి సూపర్ హిట్ అయింది. గతంలో సుడిగాలి సుధీర్, రష్మీ మధ్య ఉండే కెమిస్ట్రీ ఏ రేంజ్‌లో ఉండేదో ఇప్పుడు జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్, వర్షిణి మధ్య అంతగా కామెడీ వర్కవుట్ అవుతోంది. అయితే ఇమ్మాన్యుయెల్‌ లేకపోతే కష్టం అంటూ వర్ష చెప్పిన తీరు ఆశ్చర్యపరిచింది. ఇద్దరు ఎంత డెప్త్ గా ప్రేమించుకుంటున్నారో తెలియజేశారు. కానీ ఆ తర్వాత కొంత గ్యాప్‌ మెయింటేన్‌ చేస్తూ వస్తున్నారు.

కానీ వారిలో ఆ ప్రేమ అలానే ఉందనే విషయాన్ని మరోసారి నిరూపించుకున్నారు. పడిపోయిన ఇమ్మాన్యుయెల్‌ని చూసి షాక్‌ అయ్యింది వర్ష. బోరున విలపిస్తూ సహాయం కోసం వేడుకుంది. ఇదే ఇప్పుడు అందరి చేతి కన్నీళ్లు పెట్టిస్తుంది. మరి ఇంతకి ఏం జరిగిందంటే. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదలైంది. ఇందులో ఆది కామెడీ ఎప్పటిలాగే అలరించింది. నవ్వులు పూయించింది. కానీ చివర్లో ఓ స్కిట్‌ ప్రదర్శించారు ఇమ్మాన్యుయెల్, వర్ష.

ఇందులో ఇమ్మాన్యుయెల్‌ చనిపోతే వర్ష ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దామని చెబుతుంది యాంకర్‌ రష్మి. ఇక నెలపై చనిపోయిన స్థితిలో పడి ఉండగా, అది చూసిన వర్ష తట్టుకోలేకపోయింది. వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. ఎవరైనా ఉన్నారా? అంటూ భోరున విలపించింది. ఇది అందరిని కదిలించడం విశేషం. అయితే ఇది చూడ్డానికి స్కిట్టే అయినా, అందులో వర్ష నిజంగానే ఇన్‌వాల్వ్ అయిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *