పొలంలో దొరికిన వజ్రం, ఎంతకు అమ్ముడు పోయిందో తెలుసా..?

వారంతా పొలం పనులు చేయరు. వజ్రాల వేట కోసం అన్వేషిస్తారు. తుగ్గలి, జొన్నగరి, పగిడిరాయి, ఎర్రగుడి, మద్దికెర, బసినేపల్లి, అగ్రహారం, రాతన, కొత్తూరు తదితర ప్రాంతాల్లో ఈ వజ్రాల వేట ఎక్కువగా ఉంటుంది. చాలామంది సామాన్యులు, కూలీలు ఇక్కడి దొరికన వజ్రాలతో లక్షాధికారులయ్యారు . అయితే వర్షాకాలంలో కర్నూలు జిల్లాలో రైతులు పొలాల్లో వజ్రాల వేట కొత్తేం కాదు.

తమ అదృష్టం పండి పొలంలో వజ్రాలు దొరుకుతాయేమోనని ఆశగా వెతుకుతుంటారు. ఏదైనా రంగురాయి దొరికితే వజ్రమేమోనని పరీక్షించుకోవడానికి బంగారం షాపులకు పరుగులు తీస్తుంటారు. ఒక్క వజ్రం దొరికినా తరాల నాటి తమ దరిద్రం అంతా ఒక్కథాటితో కొట్టుకుపోతుందని వజ్రాల కోసం ఆశగా వెదుకులాట సాగిస్తారు. ఐతే తాజాగా కర్నూలు జిల్లాలో కొందరికి వజ్రాలు దొరికినట్లు సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

తుగ్గలి మండలం జొన్నగిరి పొలాల్లో ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల తేనె రంగులో ఉన్న ఓ వజ్రం లభించినట్లు సమాచారం. దాన్ని ఓ స్థానిక వ్యాపారి వద్ద అమ్మకానికి పెట్టగా ఏకంగా రూ.25 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అదేరోజు మరో ఇద్దరికి రెండు వజ్రాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. మద్దికెర మండలం మదనంతపురం వాసి పొలంలో శనివారం కలుపు తీస్తుండగా వజ్రం దొరికినట్లు సమాచారం. ఈ సీజన్‌ ముగిసేలోపు ఇంకెంతమందిని అదృష్టం వరిస్తుందో వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *