జైలులో చంద్రబాబుకి అనారోగ్య సమస్యలు, జైలులోనే బాబుకి వైద్య పరీక్షలు.

గత 32 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన డిహైడ్రేషన్ తో పాటు అలర్జీకి గురయ్యారని తెలుస్తోంది. దీనిపై కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అటు టిడిపి నాయకులు సైతం చంద్రబాబు అనారోగ్యంపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు ఐదు కిలోల బరువు తగ్గారని ఆయన సతీమణి భువనేశ్వరి చెబుతున్నారు. అయితే తాజాగా తమ అధినేత చంద్రబాబు స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నారని అంటున్నారు.

ఈ స్కిన్ అలర్జీ ఇప్పుడు కాదు… కొన్నేళ్ల నుంచి చంద్రబాబు చర్మ సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. ఐతే.. నెల రోజులకు పైగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండటంతో.. వాతావరణ మార్పుల వల్ల డీహైడ్రేషన్ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. చంద్రబాబుకు చర్మ సంబంధ ఇబ్బందులు పెరగడంతో.. జైలు అధికారులు ప్రత్యేకంగా డెర్మటాలజిస్టులను పిలిపించారని తెలిసింది. ప్రస్తుతం ప్రత్యేక వైద్యుల బృందం.. జైలులో చంద్రబాబుకి వైద్య పరీక్షలు జరుపుతోంది.

చంద్రబాబు కోసం జైలులో ప్రత్యేకంగా ఓ వైద్యుల బృందం నెల నుంచి అక్కడే ఉంది. ఐతే.. చర్మ సంబంధ సమస్యల దృష్ట్యా అధికారులు.. ప్రత్యేక శ్రద్ధ తీసుకొని.. నిపుణులను పిలిపించారని తెలిసింది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో చంద్రబాబు నెల రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ప్రతి రోజూ ఆయన ఆరోగ్యాన్ని ప్రత్యేక వైద్యుల బృందం పరిశీలిస్తోంది. నెలపాటూ ఎలాంటి సమస్యలూ రాలేదు. ఇప్పుడు మాత్రం చర్మ సంబంధ సమస్యలు ఎక్కువైనట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *