త్రిప్తి డిమ్రి…ఈమె స్క్రీన్ మీద కనిపించేది చాలా తక్కువ సమయం అయినప్పటికీ హీరోయిన్ రష్మిక మందాన కంటే కూడా ఈమె చాలా ఎక్కువ పేరుని సంపాదించుకుంది. అయితే ఈమె ఇంతకుముందు కొన్ని సిరీస్ లలో కూడా నటించింది. అయితే ఒక్క మంచి సక్సెస్ పడితే వారి క్రేజ్ అమాంతం పెరగడం మనం చూస్తూనే ఉన్నాం. ఉత్తరాఖండ్ బ్యూటీ తృప్తి డిమ్రీ ఇటీవలే రణ్బీర్కపూర్ టైటిల్ రోల్లో నటించిన యానిమల్ చిత్రంలో జోయా పాత్రలో హాట్ హాట్గా అందాలు ఆరబోసింది.
ఈ అమ్మడి ఆరబోత చూసి అందరు కూడా ఎవరు ఈమె అని ఆరాలు తీయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఆమె క్రేజ్ కూడా పెరిగింది. యానిమల్ చిత్రానికి ముందు తృప్తి డిమ్రి ఫాలోవర్ల సంఖ్య 60K కాగా.. తాజా అప్డేట్ ప్రకారం యానిమల్ రిలీజయ్యాక కేవలం మూడు రోజుల్లోనే రెట్టింపు 1.2 మిలియన్కు చేరుకుంది. అంటే యానిమల్ సినిమా ఈ అమ్మడికి ఎంత క్రేజ్ పెంచిందో అర్ధమవుతుంది.
యానిమల్ విడుదలైనప్పటి నుంచి తృప్తి పేరు ఇంటర్నెట్లో ట్రెండింగ్ టాపిక్గా మారిపోవడంతో ఈ భామకి హిందీలోనే కాదు టాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయని అంటున్నారు. మరి సౌత్లో తొలిసారి ఏ హీరో సరసన ఈ అమ్మడు నటిస్తుందో చూడాల్సి ఉంది.