కర్ణాటకకు చెందిన శంకరప్పకు 45 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాలేదు.. దీంతో అప్పటికే పెళ్లై భర్త నుంచి విడిపోయిన 25 ఏళ్ల మేఘన.. శంకరప్పను ప్రేమించి గతేడాది అక్టోబర్ లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి అయ్యాక శంకరప్పను రూ. 2.5 కోట్ల భూమిని అమ్మాలని ఒత్తిడి తెచ్చింది. దీనికి శంకరప్ప అమ్మ ఒప్పుకోలేదు.. దీనితో ఇంట్లో తరుచు గొడవలు జరగడంతో శంకరప్ప తన పొలం వద్ద చెట్టుకి ఉరేసుకొని చనిపోయాడు. పూర్తీ వివరాలలోకి వెళ్తే కర్ణాటక కు చెందినటువంటి 45 ఏళ్ల శంకరన్నకు ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ఓకే కాలేదు.
కానీ ఎవరి జీవితంలో అయినా పెళ్లి అనేది ప్రధానంగా ఉంటుంది. ఇంతలోనే భర్త నుంచి విడాకులు తీసుకుని వచ్చిన 25 సంవత్సరాల మేఘనను శంకరన్న ఒక సందర్భంలో కలిశారు. ఇద్దరి మధ్య ప్రేమ కుదిరింది. ఇంకేముంది ఇది కాస్త పెళ్లి వరకు దారి తీసింది. దీంతో వీరి పెళ్లి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అలా పెళ్లి అయిన తర్వాత వీరిద్దరూ కలిసి యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ కూడా చేసేవారు. వీరి జంటను చూసి ఎంతో మంది వ్యూవర్స్ అభిమానులు పెరిగారు. దీంతో వీరి జీవితం చక్కగా సాగుతూ వచ్చింది.వీరి వీడియోలు చూసిన అందరూ వీరు చాలా సంతోషంగా ఉన్నారు అనుకున్నారు.

కానీ వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కుదరలేదు. శంకరన్న ఆ అమ్మాయితో సరిగ్గా ఉండడం లేదని, ఇద్దరి మధ్య ఎలాంటి ఫీలింగ్ కలగడం లేదని ఆ అమ్మాయి తరచూ ఫీలయ్యేదట. ఇంతలో ఇద్దరి మధ్య ఆస్తుల విషయంలో గొడవలు వచ్చాయి. ఈ క్రమంలో అత్తా కోడళ్ల మధ్య గొడవ తారాస్థాయికి వెళ్ళింది. కొంత ఆస్తిని తన పేరున రాయాలని మేఘన పట్టుబట్టడంతో శంకరన్న తల్లి అందుకు ఒప్పుకోలేదు. దీంతో మేఘన శంకరన్న ను వివిధ రకాలుగా నిందించింది. చివరికి మనస్థాపానికి గురైన శంకరన్న తన పొలం వద్దకు వెళ్లి ఉరి వేసుకుని మరణించాడు. మరి ఈ ఘటన పై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.