ఇక ఫస్ట్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా హీరోయిన్ కిరణ్ రాథోడ్ ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఈ రెండో వారంలో షకీలా, మూడో వారంలో సింగర్ దామిని, నాల్గోవ వారంలో రతిక, శుభశ్రీ , ఆరో వారం నయని పావని ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఏడో వారం పూజావెళ్లిపోయారు. ఇక ఎనిమిదో వారం సందీప్ ఎలిమినేట్ అయ్యారు. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ లో మొదటగా 14 మంది హౌస్ లో అడుగుపెట్టారు. ఇక తర్వాత ఐదో వారంలో ఐదుగురు ఎలిమినేట్ తర్వాత ఐదు మంది వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు.
ఇక హౌస్ లో ప్రస్తుతం… 12 మంది మిగిలారు. వీరిలో శివాజీ, గౌతమ్, ప్రశాంత్, అశ్విని ఈ వారం నామినేషన్స్ లో లేరు. అర్జున్ అంబటి, అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టి, బోలే షవాలి, టేస్టీ తేజ, యావర్, రతికారోజ్ నామినేషన్స్లో ఉన్నారు. ఇక మొదటి నుంచి ఓటింగ్ పరంగా ఈ వారం ఎలిమినేట్ అయ్యేది.. శోభా శెట్టి అనుకున్నారు అంతా. నిజానికి ఆమె గతవారమే ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ బిగ్ బాస్ వారి అంచనాలను తలకిందులు చేస్తూ సందీప్ ను పంపించేసి ఆమెను హౌస్లో సేఫ్ చేశాడు.

ఈసారి కూడా బిగ్ బాస్ అదే ప్లాన్ అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తన కోసం మరో కంటెస్టెంట్ను బలి చేశారని అర్థం అవుతుంది. ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు.. శోభా దోస్త్ టేస్టీ తేజ. మొత్తానికి ఈ వారం టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోయాడు. ఇక 9 వారాలుగా తన ఆటతో అలరిస్తున్న తేజ.. ఇంటికి రూ.13.5 లక్షలు తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. అంటే రోజుకు రూ.21,428వేలు సంపాదించాడు. ఈ లెక్కన తేజ బాగానే వసూలు చేశాడని తెలుస్తోంది. బిగ్ బాస్ షో పేరిట తేజ గట్టిగానే వసూలు చేసినట్లు నెటిజన్స్ చెప్పుకుంటున్నారు.