కలర్స్ స్వాతి జీవితాన్ని సర్వనాశనం చేసిన కన్నతల్లి. ఎందుకో తెలుసా..?

మా టీవీ కండక్ట్ చేసిన ‘కలర్స్’ షోకు స్వాతి హోస్ట్ గా పని చేసింది. అందుకే ఆమెకు కలర్స్ స్వాతి అనే పేరు స్థిరపడిపోయింది. ఈ కార్యక్రమాన్ని చూసిన దర్శక నిర్మాతలు ఆమెకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు ఇవ్వడం ప్రారంభించారు. ఆ తర్వాత ఆమె హీరోయిన్ గా కూడా చేశారు. అయితే తమిళం లో తెరకెక్కిన ‘సుబ్రమణ్యపురం’ అనే సినిమా తో హీరోయిన్ గా తొలిసినిమా చేసింది. ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో ఈమెకి అవకాశాలు క్యూ కట్టాయి. అలా సురేష్ ప్రొడక్షన్స్ న్యాచురల్ స్టార్ నాని ని ఇండస్ట్రీ కి హీరోగా పరిచయం చేస్తూ తీసిన ‘అష్టాచమ్మా’ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో ఆమెకి అవకాశాల వెల్లువ కురిసింది. ఆ తర్వాత కలర్స్ స్వాతి హీరో నిఖిల్ తో చేసిన ‘కార్తికేయ’,’స్వామి రారా’ చిత్రాలు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి హీరోయిన్ గా ఆమె స్థాయిని మరింత పెంచేలా చేసాయి. అలా కెరీర్ వేరే లెవెల్ కి వెళ్తున్న సమయం లో వికాస్ వాసు అనే మలయాళీ పైలట్ ని పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఆమె ‘పంచతంత్రం’ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీ ఆమెకి అచ్చి రాలేదు కానీ స్వాతి గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది.

అదేమిటంటే ఈమె కెరీర్ వేరే లెవెల్ కి వెళ్లకుండా అడ్డుపడింది ఆమె కన్నా తల్లే అట. ప్రతీ విషయం ఆంక్షలు పెడుతూ, షూటింగ్స్ కి కూడా వచ్చి ఏదైనా రొమాంటిక్ సన్నివేశం తీస్తున్నారో లేదో చూసేడట. అలాంటి సన్నివేశాలు పెడితే లొకేషన్ లోనే గోల గోల చేసేస్తుందట. స్క్రిప్ట్ సెలక్షన్ విషయం లో కూడా ఈమె పక్కన ఉండాల్సిందే. ఈమె అనుమతి లేనిదే స్వాతి సంతకం చేసేదానికి కూడా లేదట. ఇక హీరో నిఖిల్ తో ప్రేమాయణం నడుపుతుంది అనే రూమర్ ఇండస్ట్రీ లో ప్రచారం అవ్వడం వాటిని నమ్మి స్వాతి కి వెంటనే పెళ్లి చేయించి సినిమాలను ఆపించేసిందట. ఇదే ఇండస్ట్రీ లో ఇప్పుడు జోరుగా సాగుతున్న ప్రచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *