చిత్రసీమలో మరో విషాదం, చిరంజీవి నిర్మాత కన్నుమూత.

ముఖేష్ ఉద్దేశి నిర్మాత అల్లు అరవింద్‌ తో కలిసి కొన్ని సినిమాలను సంయుక్తంగా నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి హిందీలో నటించిన ‘ప్రతిబంధ్’, ‘జెంటిల్ మెన్’ చిత్రాల నిర్మాణంలో ముఖేష్ భాగం పంచుకున్నారు. తెలుగులో ‘ఎస్పీ పరశురాం’ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ చిత్రం ఆశించిన విజయం అందించలేదు.

ఇక హిందీలో ‘కౌన్’, ‘కున్వారా, & ‘కలకత్తా మెయిల్’ వంటి పలు చిత్రాలను నిర్మించిన ఆయన, తర్వాతి రోజుల్లో లైన్ ప్రొడ్యూసర్ గా మారారు. అయితే భారతీయ చిత్రసీమలో మరో విషాదం చోటు చేసుకుంది. రీసెంట్‌గా ఇద్దరు తమిళ కమెడియన్స్ చనిపోయిన సంగతి మరవక ముందే తాజాగా బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో పలు చిత్రాలను నిర్మించిన ప్రొడ్యూసర్ ముకేశ్ ఉదేశి అనారోగ్యంతో కన్నుమూసారు. ఈయన గత కొంత కాలంగా ఈయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు.

దీంతో ఫ్యామిలీ మెంబర్స్ ఆయన్ని చెన్నైలోని ఓ హాస్పిటల్‌లో చేర్పించారు. మరికొన్ని కొన్ని రోజుల్లో ఈయన కిడ్నీ మార్పిడి చికిత్స చేయాల్సి ఉండగా.. ఇందులోనే ఈయన కన్నుమూయడం విషాదకరం. ముకేశ్‌కు భార్య కొడుకు ఉన్నారు. ముకేశ్ ఉదేశి సినీ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సోమవారం సాయంత్రం ఈయన కన్నమూయగా.. ఈ విషయాన్ని కుటుంబ సభ్యలు ఆలస్యంగా మీడియాకు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *