ఇండస్ట్రీలో విషాదం. ప్రముఖ కమెడియన్ మృతి.

బోండా మణి మరణ వార్తతో తమిళ చిత్ర పరిశ్రమ విషాదంలోకి వెళ్లింది. ఆయనకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తూ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు. ఇక బోండా మణి పార్థివదేహాన్ని అభిమానులు సందర్శించేందుకు ఆయన నివాసంలో ఉంచనున్నారు. అయితే తమిళ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ స్టార్ కమెడియన్ రాజు శ్రీ వాత్సవ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. ఈ ఘటన మరువక ముందే.. మరో స్టార్ కమెడియన్ బోండ మణి (59) ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు.

కొంత కాలం క్రితం ఆయన మూత్ర పిండాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనను ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు కుటుంబ సభ్యులు. వారం రోజుల నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిందని.. చికిత్స పొందుతున్న క్రమంలోనే తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు. బోండ మణి సెప్టెంబర్ 19, 1963 లో జన్మించారు. ఆయన అసలు పేరు కేదీశ్వరన్.. శ్రీలంకలోని మన్నార్ జిల్లాలో పుట్టి పెరిగాడు.

శ్రీలంక శరణార్ధి అయిన మణి తమిళనాడుకు వలస వచ్చాడు. తన కెరీర్ లో దాదాపు 270 సినిమాలకు పైగా నటించారు. ఆరు, సుందర్ ట్రావెల్స్, మరుధమలై, విన్నర్ , వేలాయుధం తదితర సినిమాల్లో నటించారు. తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. మణి 1990లో శ్రీలంకకు తిరిగి వచ్చి “లతా స్టోర్స్” అని పేరుతో కిరాణా దుకాణాన్ని ప్రారంభించాడు. 1990లో ఒక కాలు దాదాపు పక్షవాతానికి గురై ఇబ్బంది పడుతున్నారు. బోండా మణి కన్నుమూయడంతో సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *