శ్రీదేవి మరణం వెనుక అ రహస్యాలను బయటకి చెప్పిన శ్రీదేవి భర్త.

శ్రీదేవి 2018లో దుబాయ్‌లోని ఓ హోటల్‌లో మరణించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత బోనీ కపూర్‌ను పెళ్లాడిన ఆమెకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉ‍న్నారు. ప్రస్తుతం శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ సినిమాలతో బిజీగా ఉంది. జూనియర్‌ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన శ్రీదేవి భర్త బోనీ కపూర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ వార్త ఇప్పటికి సినీ పరిశ్రమను,అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది.

అయితే చాలా ఏళ్ల తర్వాత శ్రీదేవి మరణం పై ఆమె భర్త బోణికపూర్ ఘాటుగా స్పందించారు. చాలా ఏళ్లుగా ఈ విషయం పైన విచారణను ఎదుర్కొంటున్నట్లు ఆయన తెలిపారు. అలాగే శ్రీదేవి మృతికి గల కారణాలను కూడా ఆయన వివరించడం జరిగింది.. ఒక ఇంటర్వ్యూలో బోణికపూర్ ఈ విషయాన్ని ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. శ్రీదేవి మరణం సహజమైనది కాదు ఇది ప్రమాదవశాత్తు జరిగింది విచారణలో నేను 48 గంటల పాటు మాట్లాడాను అని తెలిపారు. అందుకే ఇకమీదట మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను భారతీయ మీడియా నుంచి చాలా ఒత్తిడి ఉన్నందువలన వారికి ఈ విధంగా వివరించాలని కోరుతున్నాను.

ఆమె పైన హత్యాయత్నం జరగలేదని తెలిపారు.. నేను లై డిటెక్టర్ తో పరీక్షతో సహా అన్ని పరీక్షలు చేయించుకున్నాను.. చివరకు రిపోర్టులో అది ప్రమాదవశాత్తు జరిగిందని తెలిపారు బోణికపూర్.. శ్రీదేవి అందంగా కనిపించేందుకు డైట్ చేస్తూ ఉండేది వాటివల్లే ఆమె మరణించి ఉండవచ్చని బోణికపూర్ తెలిపారు. శ్రీదేవి ఎక్కువగా పస్తులు ఉండేది స్క్రీన్ పైన అందంగా కనిపించడానికి తన బాడీ షేప్ తో ఉండాలని కోరికతోనే ఇలా డైట్ పాటించేది. ఈ కారణంగానే ఎన్నోసార్లు స్పృహతప్పి పడిపోయింది అని తెలిపారు. ఉప్పులేని ఆహారం తీసుకోవడం వల్ల ఈమెకు చాలా సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు.. శ్రీదేవి మరణం మాత్రం దురదృష్టకరమని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *