రోగులకు సేవలు అందించిన శిఖ కరోనా బారిన పడి పక్షవాతానికి గురయ్యారు. కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ‘ఫ్యాన్’ చిత్రంలో కీలక పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శిఖ. ఆ తర్వాత ‘రన్నింగ్ షాదీ’, ‘అన్సీన్ ఈవిల్ 2’ మూవీస్తో తన క్రేజ్ను మరింత పెంచుకున్నారు. అయితే శిఖ మల్హోత్రా.. ఢిల్లీలోని వర్ధమాన్ మహవీర్ మెడికల్ కళాశాల, సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో నర్సింగ్ నేర్చుకుంది. వైద్య విద్యార్థిని అయిన శిఖ నటనపై మక్కువతో బాలీవుడ్లో అడుగుపెట్టింది.
షారుక్ ఖాన్ ‘ఫ్యాన్’ సినిమాలో కీలక పాత్రలో నటించింది. రన్నింగ్ షాదీ, అన్సీన్ ఈవిల్ 2.. ఇలా తదితర చిత్రాల్లో నటించింది. 2020లో కోవిడ్ మహమ్మారి విజంభించిన సమయంలో ముంబైలో బాలాసాహెబ్ ఠాక్రే ట్రామా సెంటర్ ఆసుపత్రిలో నర్సుగా సేవలందించింది. తన తొలి చిత్రం కాంచ్లి రిలీజైన నెల రోజులకే ఆమె నర్సుగా అవతారమెత్తడంతో సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. కానీ విధి బలీయమైనది. కోవిడ్ నుంచి కోలుకునే సమయానికి బ్రెయిన్ స్ట్రోక్..మంచివారికే కఠిన పరీక్షలు అన్న చందంగా అదే ఏడాది చివర్లో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది.

కోవిడ్ నుంచి బయటపడే సమయంలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీనివల్ల ఆమె శరీర కుడిభాగం పక్షవాతానికి లోనైంది. చికిత్సలో భాగంగా ఆమె స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఫలితంగా కొంత లావైంది కూడా! ఈ పరిణామాలతో కలత చెందిన ఆమె తిరిగి సినిమాల్లోకి రావాలన్న ఆలోచనను కూడా రానివ్వలేదట. కానీ ఇంకా ఎన్నాళ్లు బాధతో కుంగిపోవాలి? నా మీద నేనే పోరాటం చేస్తా.. మళ్లీ మునుపటిలా మారిపోతానని సంకల్పించుకుంది శిఖ.