ద రోజ్ విల్లా, ముగ్గురు మొనగాళ్లు, పచ్చీస్, సైకిల్, మ్యాడ్ .. లాంటి పలు చిన్న సినిమాల్లో హీరోయిన్ గా, కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసింది. ఇటీవల కొన్ని వెబ్ సిరీస్లలోనూ యాక్ట్ చేసింది శ్వేతా. సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుంది శ్వేతావర్మ. అయితే బిగ్బాస్ షో ద్వారా పాపులర్ అయినవారిలో శ్వేతా వర్మ ఒకరు. ఈ షోకు రాకముందు తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది శ్వేతా. రాణి, పచ్చీస్, మ్యాడ్, ముగ్గురు మొనగాళ్లు, గుడ్ లఖ్ సఖి, ఏకం, రోజ్ విల్లా వంటి చిత్రాల్లో కనిపించింది.
సహయనటిగా అనేక సినిమాల్లో కనిపించినప్పటికీ ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. కానీ బిగ్బాస్ షో ద్వారా మరింత ఫేమస్ అయ్యింది. అయితే బిగ్బాస్ తర్వాత గుర్తింపు మాత్రమే వచ్చింది కానీ.. ఇండస్ట్రీలో అవకాశాలు మాత్రం రావడం లేదనిపిస్తుంది. చాలా రోజులుగా ఈ బ్యూటీ సైలెంట్ అయ్యింది. తాజాగా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. కొన్ని రోజులుగా నెట్టింట సైలెంట్ అయిన శ్వేతా వర్మ.. ఇటీవల తన ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి చెబుతూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. “మా ఇంట్లో భయంకరమైన అగ్ని ప్రమాదాన్ని చూశాను. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగింది.
రూం మొత్తం కాలిపోయింది. నా ఫ్యామిలీ, నా పెట్స్ సేఫ్ గానే ఉన్నారు. కానీ ఈ భయంకరమైన ఘటన నుంచి కోలుకునేందుకు కాస్త టైం పట్టేలా ఉంది. నా కోసం మీరు ప్రార్ధించండి. మేం అయితే ఇప్పుడు క్షేమంగానే ఉన్నాం. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్లీ సోషల్ మీడియాలోకి వస్తాను” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం శ్వేతా చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుండగా.. ఆమెకు ధైర్యం చెబుతున్నారు నెటిజన్స్. బిగ్బాస్ రియాల్టీ షోలో శ్వేతావర్మ గొడవలు.. ఆనీ మాస్టర్ తో క్లోజ్ గా ఉండడంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.