మేనల్లుడి పెళ్ళికి మేనమామ జగన్ డుమ్మా, అసలు ఏంటో తెలిస్తే షాక్ అవుతారు.

ఏపీ కాంగ్రెస్ పగ్గాలను చేజిక్కించుకున్న వైఎస్ షర్మిల సీఎం జగన్, చంద్రబాబులపై విమర్శల దాడికి దిగారు. ఏపీలో ఊసే లేని కాంగ్రెస్ పార్టీకి షర్మిల చేరిక బలాన్ని చేకూర్చింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవాలని షర్మిల జిల్లాల టూర్లు చేస్తూ.. గత ప్రభుత్వల వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే.. ప్రస్తుతం అధికారంలో ఉన్న తన సొంత అన్న సీఎం జగన్ ను షర్మిల వదలకుండా విమర్శలు చేస్తోంది.

అయితే జగన్ మేనల్లుడి వివాహ నిశ్చితార్థానికి హాజరైన సందర్భంలోనే ఆయన అక్కడ మెలిగిన తీరు, ఎప్పుడు వెళ్లిపోదామా అని చూసిన వైఖరిపైనే అప్పట్లో పలు విమర్శలు వెల్లువెత్తన సంగతి తెలిసిందే. ఆ నిశ్చితార్థ వేడుక తరువాత షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన సంగతి తెలసిందే. ఇక అక్కడి నుంచి వైసీపీ సోషల్ మీడియాలో ఆమెసై అనుచిత విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అంతే కాకుండా ఆమె పేరు ముందు వైఎస్ అన్న పేరును కూడా తీసేసి వైసీపీ సోషల్ మీడియా ఆమెపై దారుణంగా విమర్శల దాడులు చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేసి విమర్శల దాడులు చేయడం ఈ నాలుగున్నరేళ్లుగా వైసీపీ అనుసరిస్తున్న విధానమే అయినా.. సొంత చెల్లి విషయంలో జగన్ అంతే కక్ష పూరితంగా వ్యవహరించడంపై వైసీపీ శ్రేణుల్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. మొత్తం మీద సొంత మేనల్లుడి పెళ్లికి డుమ్మా కొట్టి జగన్ తన ఇమేజీని మరింత డ్యామేజీ చేసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *