అల్లుడు విడిపోవడంతో సూపర్స్టార్రజనీ కాంత్ తీవ్రంగా బాధపడ్డారు. అయితే ధనుష్తండ్రి వారిద్దరూ మళ్లీ కలుస్తారని, రజనీకాంత్తో మాట్లాడి వాళ్లను తిరిగి ఒక్కటి చేస్తారని అప్పుడు చెప్పుకొచ్చారు. దీంతో వాళ్లిద్దరు ఎప్పటికైనా కలవకపోతారా? అని ఎంతో ఎదురుచూశారు. కానీ, అలా జరగలేదు. అయితే ఐశ్వర్య రజనీకాంత్ ఇద్దరు కొడుకులతో ప్రస్తుతం విడిగా ఉంటోంది.రీసెంట్గా ఓ నటుడితో ఐశ్వర్య క్లోజ్గా మూవ్ అవడమే రెండో పెళ్లి చేసుకుంటోందనే వార్తలు తెరపైకి వచ్చాయి.అంతే కాదు రిసార్ట్లో కూడా నటుడితో ఐశ్వర్య కనిపించడం ఈపుకార్లు మరింత బలం చేకూర్చినట్లైంది.
హీరో ధనుష్తో వివాహం జరిగిన తర్వాత 18ఏళ్ల పాటు వీరిద్దరూ వైవాహిక జీవితాన్ని గడిపారు. ఐశ్వర్య, ధనుష్ దంపతులకు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు.వాళ్లు కూడా పెద్దైన తర్వాత ఈ స్టార్ జోడి విడిపోవడం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. అయితే ఐశ్వర్య రజనీకాంత్ కోలీవుడ్ యంగ్ హీరోతో చనువుగా ఉంటున్నారు. పలుమార్లు కలిసే అందరికి కనిపించారనే వార్తలు నిజమైనప్పటికి ..ఆమె రెండో పెళ్లి చేసుకుంటుందా లేదా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం దర్శకురాలిగా కొనసాగుతున్న ఐశ్వర్య రజనీకాంత్ ..స్టార్ హీరోగా ఉన్నటువంటి ధనుష్ని కాదని యంగ్ హీరోని పెళ్లాడితే తండ్రి రజనీకాంత్, భర్త ధనుష్ అభిమానులు పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారా అనే దానిపై కూడా సోషల్ మీడియాలో పెద్ద రచ్చ నడుస్తోంది.
హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడిపోతున్నారనే వార్త ఎప్పటి నుంచో వినిపిస్తున్నప్పటికి ..విడిపోవడానికి కారణం ఏమిటో మాత్రం ఇప్పటికి ఇద్దరిలో ఎవరూ బయటపెట్టలేదు. అయితే వీడిపోయినప్పటికి ఐశ్వర్య, ధనుష్ మళ్లీ కలుసుకుంటారనే వార్తలే ఎక్కువగా వినిపించాయి. అందుకే పిల్లలు ఇద్దరూ ధనుష్ దగ్గర కొన్ని రోజులు ఐశ్వర్య దగ్గర కొన్ని రోజులు ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఈమధ్య కాలంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో విడాకులు ఇవ్వడం…వేరే వాళ్లతో సహజీవనం చేయడం లేదా పెళ్లి చేసుకోవడం కామన్గా మారింది. బాలీవుడ్లో మలైకా అరోరా కూడా భర్తకు డైవర్స్ ఇచ్చి అర్జున్ కపూర్తో డేటింగ్ చేస్తోంది. మరి ఈస్టార్ జోడి విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.