గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలోని తెలుగు సినిమా ప్రేక్షకుల నుంచి సమంత పైన ఎన్నో ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నాగచైతన్య ఫ్యాన్స్ సమంతని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అంతేకాదు సినిమాల్లో కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్న.. ఎక్స్పోజింగ్ ఉన్న.. తెలుగు ప్రేక్షకుల నుంచి సమంత కి ఎన్నో నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం సమంత తెలుగు హీరో నాగచైతన్య ని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకోవడమే. అయితే సమంత విడాకుల తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ స్టార్ ఇమేజ్ ని సంపాదించుకుంటు సూపర్ సక్సెస్ అవుతుంది.
అయితే ఆమె విజయ్ దేవరకొండ తో నటించిన ఖుషి సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి యావరేజ్ గా ఆడింది. దాంతో ఆమె ప్రస్తుతం ఫ్లాప్ ల్లో ఉందనే చెప్పాలి యశోద,శాకుంతలం, ఖుషి మూడు సినిమాలు కూడా ప్లాప్ అవ్వడం తో ఇప్పుడు తీసే సినిమాల మీద ఆమె ఎక్కువ దృష్టి పెట్టాలని చూస్తుంది. ఇక మయోసైటీస్ కి సంబంధించిన చికిత్స కోసం ఆమె అమెరికాకు వెళ్ళారు. ఇక రీసెంట్ గా ఒక పత్రికతో మాట్లాడిన ఆవిడ జీవితానికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా చెప్పారు.
ఇక మీదట తను చేసే సినిమాలు పూర్తిగా ఇష్టపడితేనే చేస్తానని మొహమాటానికి పోయి సినిమాలు చేయనని చెప్తూనే,తనకి తాను కంఫర్ట్ జోన్ నుంచి దాటుకొని బయటకు వచ్చి కొన్ని డిఫరెంట్ సినిమాలు చేయాలని చూస్తున్నాను అని చెప్పింది. ఇక తనకి యాక్షన్ సినిమాలు చేయడం అంటే చాలా ఇష్టమని అలాంటి సినిమాలు కూడా ఫ్యూచర్ లో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా చెప్పింది. అలాగే ప్రస్తుతం ఆవిడ సిటాడెల్ సినిమా చేస్తుంది. రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో స్పై అండ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా ఇది తెరకెక్కుతుంది.
ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు ఈ సినిమా అమెరికన్ టీవీ సీరిస్ స్ఫూర్తితో ఇండియా నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈవిడ తనకున్న వ్యాధి పట్ల ధైర్యంగా ముందడుగు వేస్తూ ప్రతి విషయాన్ని చాలా దైర్యం గా ఎదురుకుంటుంది. అలాగే ప్రస్తుతం ఉన్న యువత ని ఉద్దేశించి మాట్లాడుతూ ఎప్పుడు ఏది దక్కలేదని భాద పడకండి, ప్రతిక్షణం మీకోసం బతుకుతూ మీకు నచ్చిన జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి అంటూ యూత్ కి ఆమె ఒక మంచి సందేశాన్ని అయితే ఇచ్చారు.